Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Andhra Pradesh ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.

by CVR NEWS

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఏర్పాట్లను పరిశీలించారు. కనేకల్ క్రాస్ వద్ద హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలంతో పాటు బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని అధికారులతో, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు.టాటా పవర్, వ్యారీస్, సుజలాన్ సంస్థలు సంయుక్తంగా దాదాపు వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవల పత్తికొండలో టాటా పవర్ ఆధ్వర్యంలో చేపట్టిన 400 మెగావాట్ల ‘కనేకల్ వన్’ ప్రాజెక్టుకు నారా లోకేష్ వర్చువల్‌గా భూమిపూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కనేకల్‌లో మరో 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుకు మంత్రి ప్రత్యక్షంగా శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు.ఈ నెల 25న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: