డిండి ప్రాజెక్టు పూర్తయితే దేవరకొండ నియోజకవర్గం దరిద్రం పోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలతో లింక్ అయి ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో నీళ్లు వస్తాయని సీఎం తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని సీఎం ప్రసంగించారు.దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ అని కేసీఆర్ గుర్తు చేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి డిండి ప్రాజెక్టు కోసం, ఇక్కడి వ్యవసాయం, నీళ్ల గురించే మాట్లాడేవారు. కాంగ్రెస్ పార్టీల నాయకులే స్టేలు తీసుకురావడంతో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఆగింది. ఇప్పుడిప్పుడు కోర్టు చిక్కులు పోయాయి. కేంద్ర ప్రభుత్వం 10 ఏండ్ల సమయం తీసుకుని, మొన్న నేను చెడామడా తిట్టిన తర్వాత ఈ మధ్యనే దాన్ని ట్రిబ్యునల్కు రిఫర్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో డిండి ప్రాజెక్టు పూర్తవుతుంది అన్నారు.
Kcr
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలను తొలగించేందుకు అద్భుతమైన పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మిర్యాలగూడలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర్రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. మిర్యాలగడ్డ మీదనుంచి చెబుతున్నా. కృష్ణానదిలో ఈ సారి తక్కువ వచ్చాయి. కర్నాటకలో ఆపుకున్నరు. శ్రీశైలం దాకా వచ్చినయ్. సాగర్కు బొట్టు రాలే. ఉన్నదాంట్లో సర్దుతున్నాం. మంచినీళ్లకు, వ్యవసాయానికి ఇస్తున్నాం. ప్రతి సందర్భంలో ఈ బాధ ఉంటుంది. ఈ బాధ శాశ్వతంగా తీరే ఆలోచన బీఆర్ఎస్ చేస్తున్నది అన్నారు సీఎం కేసీఆర్.
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్ పై కల్వకుంట్ల కవిత ఉపన్యాసమిచ్చారు. సీఎం కేసీఆర్ అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించారన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం సీఎం కెసిఆర్ కి రెండు కళ్ళ లాంటివని కొనియాడారు. ఆనాటి బీడు భూముల తెలంగాణ.. నేడు పచ్చని పొలాలతో.. సిరి సంపదలతో సస్యశ్యామలంగా వర్ధిల్లుతుందంటే.. దానికి కారణం కేసిఆర్ దూరదృష్టినే కారణమన్నారు. ప్రజల ఆశీర్వదిస్తారని నమ్మకం ఉందని.. ఖచ్చితంగా మళ్లీ కెసిఆరే సీఎం అవుతారని తన ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో మూడో సారి బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఈ మేరకు మాట్లాడారు. మనం సమస్యల మీద యుద్ధం చేస్తున్నాం. కానీ ప్రతిపక్షాలు ఈరోజు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించాయి. అదృష్టం కొద్దీ ఆయనకు అపాయం తప్పింది. ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక ప్రజలకు ముఖం చూపించలేక.. ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. కత్తులతో మా అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు. దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలి. తస్మాత్ జాగ్రత్త! పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నడూ హింసకు దిగలేదు. ప్రజలు గెలిపిస్తే గెలిచాం, చేతనైనకాడికి సేవ చేశాం. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదు. మా సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోం. ఇవాళ దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ మీద జరిగిన దాడి నాపై జరిగిన దాడిగానే భావిస్తా. ఈ దాడులను ఆపకపోతే చూస్తూ ఊరుకోం. మేం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం. ప్రజలకు ఎలా సేవ చేయాలనే ఆలోచనల్లో మేముంటే.. మీరు ఇలా దుర్మార్గమైన పనుల్లో ఉన్నారు. ఇది రాజకీయమా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 5 నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించారు సీఎం కేసీఆర్. నేడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. పట్టణ శివారులో నిర్వహించే సభకు సుమారు లక్ష మంది జనం వస్తారని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి తెలిపారు. సభావేదికతో పాటు నాయకులు, కార్యకర్తల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ మొత్తం గులాబీమయంగా మారిందని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరూ లేరని సైది రెడ్డిఅన్నారు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎంపీపీ పెండెం సుజాతను మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉత్తంకుమార్ రెడ్డి అలాగే మండల కేంద్రంలోని సర్పంచులు వారి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బారస ప్రభుత్వం ను తరిమి కొట్టాలిసిన సమయం వచ్చింది.. Mla నుంచి సీఎం దాకా రాష్ట్రమును దోచుకున్నారు..నవంబర్ 3 న కాని అంతకు ముందు కాని రైతు బంధు ఇవ్వాలని చూచించాను… కానీ కేసీఆర్ మాత్రం మాట మార్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వవద్దని అనడం హాస్యాస్పదం.. స్థానిక mla వైన్స్ మీద కూడా కమిషన్ తీసుకొని దోచుకుంటున్నారు.. దళిత బంధు కూడా ఇవ్వాలని చెప్పాను.. దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా mla మాత్రం 300 ఎకరాలు దోచుకున్నాడు… ప్రభుత్వం అన్ని రకాల వర్గాల వారిని ప్రభుత్వం మోసం చేసింది… 6నెలల క్రితం చెప్పిన హుజుర్ నగర్ నుంచి 50 వేల మెజారిటీ వస్తుందని.. డిసెంబర్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు కైవసం చేసుకుంటుంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తాము… కాంగ్రెస్ పార్టీ హయాంలో లక్షల ఇండ్లు కట్టించినము..ఇప్పుడు ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 100 గజాల స్థలంతో పాటు ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తాము… మీరే మాకు కుటుంబ సభ్యులు, మీరే మాకు పిల్లలు.. 24 గంటలు ప్రజల కోసం పాటుపడుతున్నాము… 5 సార్లు mla గా ప్రస్తుతం ఎంపీ గా ఉన్న 6వ సారి mla అవుతా చిన్నదో,పెద్దదో పదవి వస్తుంది..అందరికి అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తాను… నేను ఏ ఒక్క రోజు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు.. బై బై కేసీఆర్, బై బై సైదిరెడ్డి.. మీరందరూ నన్ను ఆశీర్వదించండి మీ నమ్మకానీ నేను వమ్ము చేయను…
అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్ లక్షణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సోనియాగాంధీకి మాట ఇచ్చి… ఆ మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. సంగారెడ్డిలో విజయభేరి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ… కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీస్ అమలవుతున్నాయని… ఈ విషయంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కేసీఆర్, కేటీఆర్ వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.. ఇందిరాగాంధీ గతంలో మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారానికి వచ్చి హామీ ఇచ్చినట్లుగానే బీహెచ్ ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను పెట్టారని.. ఇదీ వారు ఒక మాట ఇస్తే నెరవేర్చుకునే మంచి వ్యక్తిత్వానికి నిదర్శమన్నారు. ఇప్పుడు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు సైతం పక్కాగా తెలంగాణలో అమలవుతాయన్నారు. రాష్ట్రం ఏర్ప డేటప్పుడు మిగులు బడ్జెట్ తొమ్మిదేళ్లలో ఉంటే అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్ పరిపాలన తీరును విమర్శించారు. అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..జగ్గారెడ్డిని సంగారెడ్డి లో50వేల అధిక్యంతో గెలిపించాలని కోరారు..జగ్గన్న.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారు.పని మంతుడు పందిరి వేస్తె కుక్క తోక తాకి కూలిందంట. మేడిగడ్డ పరిస్థితి అట్లుంది. వీళ్లను కొరడాతో కొట్టాలి. జైల్లో వేసి చిప్ప కూడు తినిపించాలి. అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలంలో పర్యటించారు. ఆయన దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునుగోడు క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాజ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ
కెసిఆర్ కుటుంబ పాలన కు చరమగీతం పాడడానికే ఆనాడు బీజేపీలోకి వెళ్లానన్నారు. నేడు కాంగ్రెస్ లోకి వచ్చానన్నారు. ఏ పార్టీలోకి వెళ్లిన నా లక్ష్యం కేసీఆర్ ను గద్దె దించడమేనన్నారు. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పన్నెండు మంది కెసిఆర్ బిఆర్ఎస్ లోకి చేర్చుకున్నాడన్నారు. నా పోరాటం ఆరోజే మొదలైందిని, కేసీఆర్ ని గద్దెదించడం నా ప్రధాన లక్ష్యమైందన్నారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుందని, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు.
ఖమ్మంజిల్లా మునిగేపల్లిలో బిఆర్ఎస్ పాలేరు నియోజక వర్గ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయనకు పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి గుడిలో కందాల ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రచారం ప్రారంభించారు.ఈ సందర్బంగా కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పింది చేసేది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా నన్నారు. త్వరలోనే దళితులందరికి దళిత బంధు అందజేస్తామని చెప్పారు. రాష్ట్రాని అభివృద్ధి పధంలో ఉంచిన బిఆర్ఎస్ ని మూడోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
మరో నాలుగు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, వెంటనే ఆయన నివాసానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వెళ్లడం, ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం తెలిసిందే. ఆ తర్వాత మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్, హరీశ్ ల ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన నాగం జనార్దన్ రెడ్డి, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ తో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భంగా నాగంను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. నాగం బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరతారన్నది ఇంకా తెలియరాలేదు.





Total views : 89971