Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana కేసీఆర్ ని గద్దెదించడమే నా ప్రధాన లక్ష్యం – రాజగోపాల్ రెడ్డి

కేసీఆర్ ని గద్దెదించడమే నా ప్రధాన లక్ష్యం – రాజగోపాల్ రెడ్డి

by Rama
kcr VS komati

మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలంలో పర్యటించారు. ఆయన దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునుగోడు క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాజ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ
కెసిఆర్ కుటుంబ పాలన కు చరమగీతం పాడడానికే ఆనాడు బీజేపీలోకి వెళ్లానన్నారు. నేడు కాంగ్రెస్ లోకి వచ్చానన్నారు. ఏ పార్టీలోకి వెళ్లిన నా లక్ష్యం కేసీఆర్ ను గద్దె దించడమేనన్నారు. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పన్నెండు మంది కెసిఆర్ బిఆర్ఎస్ లోకి చేర్చుకున్నాడన్నారు. నా పోరాటం ఆరోజే మొదలైందిని, కేసీఆర్ ని గద్దెదించడం నా ప్రధాన లక్ష్యమైందన్నారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుందని, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039192
Total views : 194643

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: