సోంపేట మండలం బారువ పెట్రోల్ బంక్ కు కూత వేటు దూరంలో ఓ కారు అదుపుతప్పి వరద కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సోంపేట మండలం గొల్లవూరు గ్రామానికి చెందిన మృత్యుంజయ (38) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మందస మండలం సిద్దిగాం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయికుమార్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. కారు ముందు సీట్లో కూర్చున్న సురేంద్ర, చక్రి ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు వాహనంలో బారువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బారువ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest Video News
: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ భుజంగం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ లో ప్రజలకు ఉన్న సమస్యలైన, ఫిర్యాదులైన తమ ద్రుష్టి కి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని, వారి పరిమితి లో లేనివి పై అధికారుల ద్రుష్టి కి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.మున్సిపాటీ అభివృద్ధి కోసం ప్రజలు, నాయకులు, సిబ్బంది కల్సి కట్టుగా కృషి చేయాలనీ కోరారు.
నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను కొనియాడారు. అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు అని, ఎందరికో ఆదర్శవంతుడు అంబేద్కర్ అని అన్నారు. పట్టణంలోని పలువురు ముఖ్య నాయకులతో పాటు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
పత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను, వట్టిచెరుకూరు మండలంలో వేలాది ఎకరాల్లో వరి పైరు వేయటం జరిగిందని, పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రావటంతో రైతు పూర్తిగా నష్టపోయారు. మెట్టపైలు అయినా సెనగ, పొగకు, మిర్చి రైతు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. తుఫాను గురించి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రభుత్వం నిమ్మకు నీరేతిన్నట్టు వ్యవహరించి రైతు జీవితాలతో ఆడుకుందని దుయ్యబెట్టారు. గత ప్రభుత్వంలో వెంటనే వ్యవసాయ అధికారి ను గ్రామాల్లోకి పంపించి నష్టం నివారణ ఎక్కువ జరక్కుండా తగు చర్యలు తీసుకున్నామని, కానీ నేటి ప్రభుత్వం అలాంటి చర్యలు ఏమి తీసుకోకపోగా కనీసం నష్టాన్ని అంచనా వేసే కార్యక్రమం కూడా చేయటం లేదని ఎద్దేవా చేశారు. వదిలేసిన రైతులు సుమారు 50 వేల రూపాయలు నష్టపోయినట్టు, మెత్త పైడ్ చేసిన ఒక్కొక్క రైతు సుమారు లక్ష రూపాయలు నష్టపోయినట్టు రైతులు తెలిపారు. వారికి వెంటనే నష్టపరిహారం కింద వడివేసిన రైతులకు సుమారు 40000 రూపాయలు, మెట్ట పైరు వేసిన రైతులకు 70 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో వరంటీల్ ద్వారా నిజమైన నష్టపోయిన రైతులకు కాకుండా తమ పార్టీ కార్యకర్తలకు నష్టం నివారణ నగదు వెళ్లిందని, కానీ నేడు అలా జరిగితే రైతులతో కలిసి రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకో చెయ్యిల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తుఫాను ప్రభావం తో శ్రీకాకుళం జిల్లాలో గత మూడు రోజులుగా మోస్తారుగా వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట నేలకొరిగి నీట మునగడంతో రంగు మారే అవకాశం ఉందని, ప్రభుత్వం రంగు మారిన ధాన్యాన్ని కొని తమను ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు…
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో ఏలేస్వరం ప్రత్తిపాడు మండలాలో భారీ వర్ష పాతం నమోదు అయ్యింది. భారీ వర్షం కారణంగా నాలుగు మండలాలలో వరి, అరటి పలు వాణిజ్య పంటలు సుమారుగా వందలాది ఎకరాల్లో నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కారణంగా వరి చేలు పూర్తిగా నీటమునిగాయని, ఈదురు గాలులకు అరటి తోటలు నేలకొరిగాయని పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిలిందని కన్నీరు పర్యతమయ్యారు. ప్రభుత్వ వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
తిరుపతి బహిరంగసభ ( Public Meeting ) :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు..
Follow us on : Facebook, Instagram & YouTube.
చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక, రేపు నారావారిపల్లి నుంచి నిజం గెలవాలి బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో నారా భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆమె మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలోను భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26న తిరుపతిలో వారిని పరామర్శించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగసభలోను ఆమె ప్రసంగిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 62158