ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో దిగిన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుందిమెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ పదవ తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు ఇద్దరే ఉన్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు రామాయంపేట గవ్వలపల్లి రహధారి శాలిపేట పాఠశాల ముందు రాస్తారోకోదిగారు.ఈ సందర్భంగా గ్రామ యువకులు విద్యార్థుల తల్లి తండ్రులు మాట్లాడుతూప్రాథమికోన్నత పాఠశాలను అప్ గ్రేట్ చేసి పదవ తరగతి వరకు చేసినప్పటికీ ఉపాధ్యాయుల కొరత కొనసాగుతుందన్నారు.సర్కారీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రం పలుమార్లు సంబంధిత అధికారులకు తెలిపినప్పటికీ స్పందన లేదని ఇటీవల పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్య తీర్చే వరకు తాము రాస్తారోకో విరమించమంటూ పాఠశాల ముందు రోడ్డు పైనే వంటావార్పు నిర్వహిస్తున్నారు. సుమారు గంట నుండి విద్యార్థులు గ్రామస్తుల రాస్తారోక కొనసాగుతూనే ఉంది.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం…
- నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనంనేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను…
- పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. నాలుగేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా…
- తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలుతిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు…
- తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.