యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది. ” ఇర్గోథియోనైన్ , సెలీనియం ” అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి. విటమిన్ ‘D’ పుస్కలము గా లభిస్తుంది అందువల్ల ఎముకలు దంత పుష్టికి సహకరిస్తుంది. మామూలుగా ఆహారములో విటమిన్’D’ లభించదు. పుట్టగొడుగులు ఆల్ట్రావైలెట్ -బి కిరణాలకు ఎక్స్ పోజ్ చేయడం వల్ల విటమిన్ డి బాగా తయరవుతుంది. మామూలుగా సూర్యకిరణాల తాకిడివల్ల శరీరానికి విటమిన్ ‘D’ అందుతుంది. అయితే దీనివలన సన్ట్యాన్ కి గురి అయ్యె ప్రమాధముంది. వీటిలో మొక్కలు , జంతువులకు సంబంధించిన లక్షణాలు రెండూ కనిపిస్తాయి. జంతువుల మాదిరిగా పుట్టగొడుగులు ఫోటోసింథసిస్ కి అనువైనవి కావు. భూచి నుంచి గ్రహించిన పోషకాలు కలిగిఉంటాయి కావున మొక్కకలలోని లక్షణాలు కలిగిఉంటాయి. మాంస్కృత్తులు లభిస్తాయి. శరీర సౌష్టవం , కండర పుష్టికి దోహదపడతాయి. పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకి , కండరాలకు , ఆక్షిజన్ సరఫరా అధికమయినందున వాటి పని సామర్ధ్యము పెరుగుతుంది. గుండె , ఊపిరితిత్తులు ఆరోగ్యం గా ఉంటాయి. డయబిటీస్ ను తగ్గిస్తుంది. రక్తపోటుకు గొడుగు బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిది. సగం కప్పు పుట్టగొడుగుల్లో ఉండేవి 9 కేలరీలు మాత్రమే! ఉడికించినవైతే 21 కేలరీల వరకు శక్తినిస్తాయి. పుట్టగొడుగుల్లో 80-90 శాతం వరకు నీరే ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి ఐదుసార్లు వీటిని తింటే రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. పుట్టగొడుగుల్లోని పొటాషియం పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. రైబోఫ్లావిన్, నియాసిన్లు శరీరంలో విశృంఖల కణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి. ఇక విటమిన్ ఈ, సెలీనియం ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.
muscles
పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాస పండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాస పండు 85 శాతం నీటిని కలిగి ఉంది. అనాస పండును తింటే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. అనాస పండులో విటమిన్ సి అధికంగా ఉంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంతాన సమస్యలతో బాధపడేవారు అనాస తినడం ఎంతో మంచిది. అనాసలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత చిన్న అనాస ముక్కను తింటే త్వరగా జీర్ణమైపోతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. అనాస పండును ముక్కలుగా చేసి, తేనెతో కలిపి తింటే శరీరానికి శక్తి మాత్రమే కాదు, మేని ఛాయ కూడా నిగారింపు వస్తుంది. అందాన్ని పెంచుకోవాలంటే అనాస తినండి. ఇది శరీరంపై ఉండే మృతకణాలను నివారించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. రోజూ పైనాపిల్ జ్యూస్ తాగినా, తిన్నా ఉల్లాసంగా ఉంటారు. అనాసలోని పొటాషియం రక్త ప్రవాహం సాఫీగా సాగేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. అనాస పండు తినడం వల్ల ఒత్తిడి, మతిమరపు, డిప్రెషన్లనీ తగ్గిస్తుంది. పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. గొంతు నొప్పి, నోటిలో పుండ్లు ఉన్నట్లయితే, అనాసరసాన్ని నోటిలో కాసేపు ఉంచుకుని మింగేయండి. తప్పకుండా అవి తొలగిపోతాయి. అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధం. అనాస కాలేయానికి, మూత్రపిండాల సమస్యలను నయం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అనాసలోని కాపర్ శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాలను వృద్ధి చేయడానికి సహాయపడుతుంది. అనాసపండులోని మాంగనీస్ ఎముకలు, దంతాలు, కండరాలు, జుట్టు సమస్యలను నివారిస్తుంది.






Total views : 78255