జనగామ శివారు యశ్వంతాపూర్లోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ ఆక్రమణ లపై ఆఫీసర్లు చర్యలు చేపట్టారు.వివిధ దినపత్రికలో పబ్లిష్ అయిన స్టోరీకి స్పందించిన ఆఫీసర్లు విచారణ జరిపి అర ఎకరం ప్రభుత్వ స్థలం కబ్జాకు గు రైనట్లు గుర్తించారు. దీంతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ఆదేశాలతో జనగామ ఆర్ఎ అన్వేష్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను జిల్లాకేంద్రంలో ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి క్యాంప్ ఆఫీస్లో సిబ్బందికి అందజేశారు.జనగామ బీఆర్ఎస్ ఆఫీస్ కి నోటీసులు… బీఆర్ఎస్ జిల్లా అధ్య క్ష పదవి ఖాళీగా ఉండడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నోటీసులు ఇచ్చినట్లు ఆర్ ఐ చెప్పారు. నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వకుంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్సిగ్నల్.రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ…
- ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్కు కేంద్రం ఆమోదం.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పరిధిలోని మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను సీపీడబ్ల్యూడీ కేడర్ నుంచి వేరు చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై ఈ పోస్టులను స్వతంత్ర ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్గా నిర్వహించనున్నారు. ఢిల్లీని వేగంగా అభివృద్ధి చెందుతున్న,…
- తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్లో హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్ను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆహ్వానించారు.…
- నేడు, రేపు చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు, రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు, వాటిపై చేపట్టిన చర్యలు, పురోగతికి సంబంధించిన నివేదికలపై సీఎం సమీక్షించనున్నారు. జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై…
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి