ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తాజాగా ఇండియాలో మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం సాహిబ్ కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్ కు ఆయన వెళ్లొచ్చినట్టు సమాచారం. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించారు. లక్షద్వీప్ లోని పర్యాటక ధామంగా మారుద్దామని ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు. మోదీని తోలుబొమ్మగా, జోకర్ గా అభివర్ణించారు. భారత్ ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. భారత విదేశాంగ శాఖ ఆ దేశ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసింది.
Read Also..
Read Also..





Total views : 79503