రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్గా హిమాన్ష్ శుక్లాను ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పటి వరకూ కమీషనర్గా ఉన్న విజయ్కుమార్రెడ్డి చెప్పాపెట్టకుండా పరార్ అయ్యారు. అప్పటి నుంచి సమాచారశాఖ కమీషనర్గా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. అయితే ఈరోజు పలువురు ఐఏఎస్లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా సమాచార శాఖకు శుక్లాను డైరెక్టర్గా నియమించింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సమాచారశాఖ వైసీపీ కార్యాలయంగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో అప్పటి కమీషనర్ నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డారని, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో గత ఐదేళ్ల అక్రమాలను ప్రభుత్వం బయటకు తెస్తుందని, అదే సమయంలో గత కమీషనర్ అక్రమాలకు సహకరించిన వారందరిపై కూడా విచారణ జరుగుతుందంటున్నారు.సమాచారశాఖ డైరెక్టర్గా నియమితులైన శుక్లాకు నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. నేరుగా ఐఏఎస్కు ఎంపికైన శుక్లా సమాచార శాఖను గాడిలో పెడతారని, అక్రమార్కుల భరతం పడతారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం యువ ఐఏఎస్ కు సమాచార శాఖ బాధ్యతలు అప్పచెప్పింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్పై వ్యాఖ్యల వెనుక ఫామ్హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి