రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్గా హిమాన్ష్ శుక్లాను ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పటి వరకూ కమీషనర్గా ఉన్న విజయ్కుమార్రెడ్డి చెప్పాపెట్టకుండా పరార్ అయ్యారు. అప్పటి నుంచి సమాచారశాఖ కమీషనర్గా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. అయితే ఈరోజు పలువురు ఐఏఎస్లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా సమాచార శాఖకు శుక్లాను డైరెక్టర్గా నియమించింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సమాచారశాఖ వైసీపీ కార్యాలయంగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో అప్పటి కమీషనర్ నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డారని, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో గత ఐదేళ్ల అక్రమాలను ప్రభుత్వం బయటకు తెస్తుందని, అదే సమయంలో గత కమీషనర్ అక్రమాలకు సహకరించిన వారందరిపై కూడా విచారణ జరుగుతుందంటున్నారు.సమాచారశాఖ డైరెక్టర్గా నియమితులైన శుక్లాకు నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. నేరుగా ఐఏఎస్కు ఎంపికైన శుక్లా సమాచార శాఖను గాడిలో పెడతారని, అక్రమార్కుల భరతం పడతారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం యువ ఐఏఎస్ కు సమాచార శాఖ బాధ్యతలు అప్పచెప్పింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90539