పీజీ విద్యార్థులు కోటి ఉమెన్స్ కాలేజ్ ముందు విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. మేనేజ్మెంట్ అటానమస్ సెమిస్టర్ కి 5000 చొప్పున ఫీజు నిర్ణయించడం జరిగిందని హాస్టల్ లో కూడా సరైన వసతులు లేవని వాటర్, వసతి లేదని ఆందోళన చేపట్టారు. ఇంతకుముందు ఈ యొక్క ఫీజు 3,500 మాత్రమే ఉండేదని ఫీజు తగ్గించాలంటూ కోటి ఉమెన్స్ కాలేజ్ గేటు వద్ద మహిళా విద్యార్థినిలు కూర్చొని ఆందోళన చేపట్టారు. పెంచిన ఫీజును తగ్గించాలని ధర్నాకు దిగారు. అందులో ముఖ్యమైనవి సరైన టాయిలెట్స్ లేకపోవడం త్రాగునీరు వెసులుబాటు లేకపోవడం మొదలగునవి ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tag:
Students Strike
గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విధ్యార్ధి సంఘం ఆధ్వర్యంలో విధ్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మృతి చెందిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. రెండు రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేసిన స్పందించిన యునివర్సిటీ యాజమాన్యం, దీంతో యునివర్సిటీ ప్రధాన గేటు ముందు విధ్యార్థులు ఆందోళన చేపట్టారు. విధ్యార్థుల ఆందోళనకు యునివర్సిటీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది మద్దతు తెలిపారు. సిబ్బందికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విధ్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు.





Total views : 77941