సుప్రీం కోర్టులో అనూహ్య సంఘటన చోటు చేసుకొంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ -CEC, ఎన్నికల కమిషనర్ల -EC నియామకాలపై దాఖలైన పిటిషన్ విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖాన్నా వైదొలిగారు. సీఈసీ, ఈసీ నియామకాలకు ఉద్దేశించిన కమిటీ నుంచి సీజేఐను మినహాయించడాన్ని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలైంది. సెక్షన్ 7 అమలుపై స్టే విధించాలని ఎన్జీవో సహా ఇతర సంస్థలు ఈ పిటిషన్ వేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని సీనియర్ న్యాయవాదులు గోపాల్ శంకరనారాయణ్, ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే వాదనలను ఇప్పుడు వినలేనని సీజేఐ బెంచ్ నుంచి వైదొలిగారు. శీతాకాల విరామం తర్వాత ఈ కేసులను తదుపరి బెంచ్ విచారిస్తుందని సీజేఐ చెప్పారు. ఈ లోగా కేంద్రం సహా ఎన్జీవోలు దీనిపై స్పందన తెలియజేయాలని ఆదేశించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 70934