ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) :
ప్రకాశం జిల్లాలో రెండు నిండు ప్రాణాలను ఎన్ డి ఎ కూటమి (NDA Alliance) ఉమ్మడి అభ్యర్థి డా. గొట్టిపాటి లక్ష్మి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే… ఎన్. డి. ఎ కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గురువారం కురిచేడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం సమయం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కి ఫోన్ వచ్చింది. దాని ప్రకారం దర్శి మండలం లోని అబ్బయపాలెం కు చెందిన దర్శి వెంకట రమణ అనే మహిళకు పురిటి నొప్పులు రావటం తో స్థానిక ఎస్. ఎస్. ఆర్ హాస్పిటల్ కు బంధువులు తీసుకువచ్చారు. ఉమ్మ నీరు చేరింది. అర్జెంటు గా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వెంటనే ఒంగోలు గాని గుంటూరు తీసుకువెళ్ళాలని.. లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిర్ధారించడంతో… విషయం తెల్సుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెంటనే రంగంలోకి దిగారు. ప్రచారం సైతం మధ్యలో నే వదిలేసి… హాస్పటల్ కు వచ్చి మహిళకు విజయవంతం గా సర్జరీ చేశారు. మహిళ పండంటి మగ బిడ్డ కు జన్మనించింది. తల్లి, బిడ్డ ఇరువురు క్షేమంగా ఉన్నారు. డాక్టర్ గా ఎన్నికల ప్రచారంలోనూ తన బాధ్యతను మర్చిపోకుండా ప్రాణాప్రాయంలో ఉన్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేయడంపై గొట్టిపాటి లక్ష్మిని.. శభాష్ గొట్టిపాటి అంటూ దర్శి ప్రజలు అభినందిస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రెండు నిండు ప్రాణాలను కాపాడిన ఎన్ డి ఎ కూటమి…



Total views : 141768