Vegesana Narendra Verma
తెలుగుదేశం పార్టీ రా కదలిరా బహిరంగ సభ కు బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. బైకులు, కార్లు, ఆటోలలో ర్యాలీగా 3000 వాహనాలలో ఇంకొల్లు సభకు తరలి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ ఇంకొల్లు చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభలో మేము సైతం పెద్ద ఎత్తున తరలి వెల్తున్నామన్నారు. రాబోయే 60 రోజుల్లో ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుండి 30, 40 వేల మెజార్టీతో తెలుగు దేశం పార్టీ గెలిచే విధంగా ఈ రోజు నుండే శంఖారావం పూరిస్తూ చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రిని చేసేంతవరకు అవిశ్రాంతంగా పోరాడుతాం అని వేగేశన నరేంద్ర వర్మ అన్నారు.
బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ బాబు జన్మదినోత్సవ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ… నారా లోకేష్ యువ గళం అనే పేరుతో రాష్ట్రము మొత్తం చుట్టూ వచ్చి ఆంధ్ర రాష్ట్రం లో యువ గళమే నారా లోకేష్ అనే విధంగా ఆయన పేరు ను మైమరిపించే విధంగా చేశారు. నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు, లోకేష్ బాబు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యంతో ఉండాలని పార్టీ శ్రేణుల్లో మరింత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపాలని వేగేశన కోరారు.
బాపట్ల పట్టణము 33వ వార్డులో గత 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి స్థానికులతో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్థలం అని వారిని ఖాళీ చేయాలనీ చెప్పటం తో అక్కడి ప్రజలకు ఏంచెయ్యాలో అర్ధం కావడం లేదు. ప్రజల సమస్యను తెలుసుకున్న వేగేశన నరేంద్ర వర్మ వారికీ ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చారు. వారు నివాసం ఉంటున్న స్థలాలకు నివేశన పట్టాలు ఇచ్చి మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.




Total views : 61773