బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్యహత్య కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అతడి బలబన్మరణానికి పరోక్షంగా కారణమైన భార్య నిఖితా సింఘానియా , అత్త నిషా, బావమరిది అనురాగ్ ను తాజాగా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిఖితాను హర్యానా లోని గురుగ్రామ్ లో అదుపులోకి తీసుకోగా.. అత్త, బావమరిదిని ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో అరెస్ట్ చేసి ముగ్గురిని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపినట్లుగా పోలీసులు వెల్లడించారు.
కాగా, భార్య వేధింపుల కారణంగా అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు ముందు అతడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో , 24 పేజీల సూసైడ్ నోట్ అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. అయితే, అతుల్ రాసిన లేఖలో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర బంధం కొనసాగిస్తున్నట్లుగా తెలిపాడు. తాను విడాకులు కోరగా.. తిరిగి తనపైనే అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించాడు. అదేవిధంగా ఆమెపై హత్యాయత్నం చేశానని, ఇష్టం లేకుండా సెక్స్ చేసేందుకు ప్రయత్నించానంటూ ఆరోపించిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కోర్టులో నెలకు రూ.2 లక్షల చొప్పున భరణం ఇవ్వాలంటూ భార్య నిఖితా నోటీసులు పంపిందని అతుల్ కన్నీటిపర్యంతమై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు తాజాగా, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అతుల్ ఆత్మహత్యపై సోషల్ మీడియా ఫ్లాట్ఫాం ‘X’ లో కూడా ‘మెన్ టూ’ఉద్యమం ట్రెండింగ్లో నిలిచింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి బహిరంగ లేఖ..ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్రెడ్డి. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. ప్రస్తుతం దర్శనానికి సుమారు…
- భారత భూభాగాలకు చైనా కల్పిత పేర్లు..అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన…
- హైదరాబాద్లో అంతులేకుండా పోతున్న రియల్ మోసాలు..హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు…
- పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ వేదికగా అమెరికా – ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో… మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ట్రంప్ అనేక సూచనలు కూడా ఇచ్చారు. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 38429