ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) సతీమణి వైఎస్ భారతి రెడ్డి(YS Bharathi Reddy)కి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. వేంపల్లిలో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహిస్తుండగా కుమ్మరం పల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పట్టాదారు పాస్ పుస్తకం వైస్ జగన్ ఫొటో ఉండటాన్ని తప్పుపట్టారు. వైసీపీ నాయకుడు కుమ్మరాంపల్లి భాస్కర్ రెడ్డి పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటో లేకుండా చూడాలని..వైయస్ భారతి రెడ్డిని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి సమావేశంలో నా ఎస్సీ.. నా బిసి.. నా మైనారిటీ అంటున్నారే కానీ.. ఒక్కసారి కూడా నా రైతన్న అని అనడం లేదని ఆయన వైఎస్ భారతీరెడ్డి వద్ద అన్నారు. రైతు భరోసా కింద ఇస్తున్న 16 వేలు రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని… నగదు మొత్తాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని భాస్కర్ రెడ్డి సూచించారు. అందుకు వైఎస్ భారతి సానుకూలంగా స్పందించారు.
- వైసీపీకి గుడ్బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- టీడీపీ శ్రేణులకు లోకేశ్ కీలక సందేశం.టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించినందుకు నిరసనగా, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చినందుకు…
- ఇవాళ కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గంలోని పండువారిపేటలో జరిగే గ్రామసభలో సీఎం పాల్గొని లబ్ధిదారులకు పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు మాచవరం జయంతి నగర్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.