ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) సతీమణి వైఎస్ భారతి రెడ్డి(YS Bharathi Reddy)కి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. వేంపల్లిలో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహిస్తుండగా కుమ్మరం పల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పట్టాదారు పాస్ పుస్తకం వైస్ జగన్ ఫొటో ఉండటాన్ని తప్పుపట్టారు. వైసీపీ నాయకుడు కుమ్మరాంపల్లి భాస్కర్ రెడ్డి పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటో లేకుండా చూడాలని..వైయస్ భారతి రెడ్డిని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి సమావేశంలో నా ఎస్సీ.. నా బిసి.. నా మైనారిటీ అంటున్నారే కానీ.. ఒక్కసారి కూడా నా రైతన్న అని అనడం లేదని ఆయన వైఎస్ భారతీరెడ్డి వద్ద అన్నారు. రైతు భరోసా కింద ఇస్తున్న 16 వేలు రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని… నగదు మొత్తాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని భాస్కర్ రెడ్డి సూచించారు. అందుకు వైఎస్ భారతి సానుకూలంగా స్పందించారు.
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కాజా టోల్గేట్ సమీపంలోని ప్రభల్ టెక్ పార్క్లో చోరీకి గురైన ఎలక్ట్రికల్ వైర్ల కేసును ఛేదించిన పోలీసులు…
- ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్కు విస్తృత ఏర్పాట్లు.ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 1,772 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.