హైదరాబాద్లో మరోసారి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మూడు కోట్ల నగదును కర్ణాటక నుంచి తరలిస్తుండగా పట్టుకున్నటాస్క్ ఫోర్స్ పోలీసులు. కర్ణాటక కీలక నేతకు బినామీగా AMR సంస్థ మహేష్ రెడ్డి ఉన్నట్టు అనుమానం.. స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల నగదు ఐటీ శాఖ కు అప్పగించిన పోలీసులు..AMR సంస్థ ఆఫీసులు,మహేష్ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించారు.
Hyderabad
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ముందుగా సీపీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా వ్యవహరించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి ఆమోఘమని చెప్పారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు. పలువురు పోలీసు అమరవీరుల కుటుంబాలను ఈ సందర్భంగా సీపీ సన్మానించారు.
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ములుగు పర్యటన నేపథ్యంలో మంత్రిని కలిసేందుకు వస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంపై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. కొండ్రాయి గ్రామంలో ఇళ్లు కోల్పోయిన మహిళలు మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తుండగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించే మీటింగ్ కు వెళ్లకుండా ప్రజలను అడ్డుకోవడమేంటని నిలదీశారు. మంత్రి హరీశ్ రావు సభ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని చెప్పారు. బాధితులను కలిసిన ఎమ్మెల్యే సీతక్క.. అక్కడి నుంచే పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి అరెస్టులపై ప్రశ్నించారు. తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం ఇచ్చే అవకాశం ఇవ్వరా? అంటూ నిలదీసిన సీతక్క.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పాకిస్థాన్ లోనా? అని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి హరీశ్ రావు పర్యటన నేపథ్యంలో ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలను కూడా పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు.
ఇండ్లు కోల్పోయిన బాధితులు మంత్రిని కలిసేందుకు వీలులేకుండా పోలీస్ స్టేషన్ లో బంధిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ తమకు కావాల్సిన వారిని ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చి తీసుకొస్తున్నారని, సాధారణ ప్రజలను మాత్రం జైలులో పెడుతున్నారని విమర్శించారు. వారు ప్రజలు కాదా అని ప్రశ్నించారు. బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. మరోవైపు.. ఇవాళ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, అబిడ్స్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, బషీర్బాగ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో గణేష్ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయిన కూడా నిమజ్జనం కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 173 ఓట్లలో 169 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. Hca పీఠం ఎవరికి దక్కనుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే ప్రెసిడెంట్ రేసులో అర్శనపల్లి జగన్ మోహన్ రావు ముందంజలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలత ప్రెసిడెంట్ స్థానాన్నే అనౌన్స్ చేయనున్నారు ఎన్నికల అధికారి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, ప్రజ్ఞాన్ ఓజా మిథాలీ రాజ్, వెంకటపతి రాజు, స్రవంతి పలువురు క్లబ్ నెంబర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ ps పరిధిలోని మేడ్చెల్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. సుచిత్ర సమీపంలోని రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు యజమాని కారును రోడ్డు ప్రక్కన ఆపి దిగి చూశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. కానీ ఎగిసి పడ్డ మంటల్లో కారు పూర్తిగా దగ్దమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
హైదరాబాద్ ఆమీర్ పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు… సనత్ నగర్ నియోజకవర్గ BRS MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమాన్ని మంగళ హారతులు పట్టి, నుదుటన తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు పలువురు మహిళలు. చరిత్రలో ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి పనులు 10 సంవత్సరాలలో చేశామన్నారు. ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పటికీ మరురవలేనన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించే మొదటి ఐదుగురిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉండాలని నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
ఎప్పట్లాగే ఈసారీ బాలాపూర్ లడ్డూ వేలం అత్యంత ఆకర్షణగా నిలిచింది. అత్యధిక ధర కూడా పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్కు చెందిన దాసరి దయానంద రెడ్డి 27 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులతోపాటు మొత్తం 36 మంది పాల్గొన్నా. బాలాపూర్ ఉత్సవ సమితి 1,116 రూపాయలతో వేలం పాట మొదలుపెట్టింది. వేలంపాటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిసహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వేలం పూర్తి కాగానే బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభించారు. ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్ సాగర్కు తరలించారు. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, షాలిబండ, ఫలక్నుమా, చార్మినార్ మీదుగా హుస్సేన్సాగర్ వైపు సాగింది.
హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో మహా వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ విఘ్ననాథుడి శోభా యాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. ఈ శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. క్రేన్ నెం.4 వద్ద చివరి పూజలు నిర్వహించారు.
సింగరేణి కార్మికులకు శుభవార్త. సింగరేణి కార్మికులకు రూ.1.53 లక్షల దసరా బోనస్ ప్రభుత్వం ప్రకటించింది. దసరా బోనస్ కింద రూ.711 కోట్లు విడుదల చేసింది. దీంతో ఓక్కో కార్మికుడికి రూ.1.53 లక్షల మొత్తాన్ని బోనస్గా ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సంస్థలో పని చేస్తున్న 42 వేల మంది కార్మికులకు దీనిని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. ఒకట్రెండు రోజుల్లో పండగ అడ్వాన్స్ను కూడా చెల్లించనున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు.





Total views : 194471