తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కిందిస్థాయి సిబ్బంది విఫలమయ్యారు. శ్రీకాళహస్తి జగనన్న కాలనీలో పర్వీన్ అనే మైనారిటీ కి చెందిన మహిళ ఇబ్బందుల్లో ఉన్నానని తెలపడంతో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా వెంటనే జనసైనికులను పంపి ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. శ్రీకాళహస్తి లో పునరావాస కేంద్రాలు లేవు, ప్రభుత్వం నుండి పట్టించుకునే నాథుడు లేడు అని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఒక్క బటన్ నొక్కి తుఫాన్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేసారు. పునరావస కేంద్రం కి తరలించిన వారికి జనసేన నాయకులు బోజన, వసతి ఏర్పాట్లు చేసారు. జనసేన నాయకులకు కార్యకర్తలను తుఫాను బాధితులు అభినందించారు.
తుఫాను ప్రభావం.. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు
271
previous post





Total views : 79465