పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, గుండ్లపల్లి వైయస్సార్ పార్టీ ఎంపీటీసీ. లోకేశ్వర్ రెడ్డి ఇంటి పైన ఎమ్మెల్యే మనుషూలు దౌర్జన్యం చేయడం మానుకోవాలనీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు,నాయకుల జోలికి వచ్చి దాడులు, దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పూతలపట్టు నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు 2024లో వైయస్సార్ పార్టీ టికెట్ ఇవ్వకుండా ఎవరికీ ఇచ్చిన అందరం కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు ప్రజలు. ప్రతి ఊరిలో రెండు మూడు వర్గాలను క్రియేట్ చేసిన ఘనత ఎమ్మెస్ బాబుది అని , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బ్రష్టు పట్టిస్తున్న ఎమ్మెస్ బాబుకు టికెట్ ఇవ్వకూడదు అని ముక్త కంఠం తో ఆరోపించారు. ప్రజలను కార్యకర్తలను అనుసరించి పోకుండా విరుద్ధంగా ఇంటిపైన దౌర్జన్మలు చేయడము ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం దారుణంగా ఉందని అక్కడి ప్రజలు మీడియా సమావేశంలో తెలియజేశారు.తాము ఎప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోరాడే నిజమైన సైనికులమని పెద్దిరెడ్డి నాయకత్వంలో మళ్లీ రాబోయే 20 ఏళ్లు జగనన్ననే సీఎం చేయటానికి అహర్నిశలు శ్రమిస్తామని వారు తెలిపారు.
ఎంపీటీసీ ఇంటిపై దౌర్జన్యం..
247
previous post





Total views : 78389