Sunday, April 26, 2026
News Navigation
Sunday, April 26, 2026
News Navigation

Breaking

Sunday, April 26, 2026
Home Latest News టమాట ల్లేవ్.. సామాన్యుడికి బారం కూరగాయలులే

టమాట ల్లేవ్.. సామాన్యుడికి బారం కూరగాయలులే

by Rama
టమాట ల్లేవ్.. సామాన్యుడికి బారం కూరగాయలులే

సింగరేణి ప్రాంతం కోల్ బెల్ట్ ఏరియా మంచిర్యాల జిల్లా లో కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టమాట ధరలు నానాటికీ దూసుకుపోతు న్నాయి. రోజురోజుకూ అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు.మందమర్రి పట్టణం కూరగాయల మార్కెట్ లో వారం కిందటి వరకు కిలో టమాట ధర రూ.30 నుంచి రూ.50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై రూ.80 కు చేరింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారిపోయాయి.ప్రతి కూర లోనూ తప్పని సరిగా ఉపయోగించే టమాట ఇప్పుడు భారంగా మారుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న టమాట ధరలు ఇటు ప్రజలతోపాటు అటు రీటైల్‌ మార్కెట్‌ను వణికిస్తోంది.గత కొద్ది రోజులుగా కూర గాయల ధరలు పెరుగుతూ నే వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ల లో కిలో టమాట రూ.80 పలుకుతోంది.కూరగాయలు కొనలేక ఆకుకూరలతో సరిపెట్టు కుందామంటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. వారం క్రితం పాలకూర, తోటకూర, గోంగూరలాంటి ఆకుకూరలు గతంలో రూ.10కి 5 కట్టల చొప్పున ఇవ్వగా ఇప్పుడు రూ.20కి 3 లేదా 4, 5 చొప్పున అమ్ముతున్నారు.మరోవైపు మిర్చి ధర కూడా కిలో రూ.80 అధిక ధర దాటింది. ఉల్లి కూడా ఘాటెక్కింది. ఈసారి సకాలంలో వానలు కురవకపోవడంతో కూర గాయల ధరలు పెరుగు తూనే ఉన్నాయి. 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అప్పటికే పొలాల్లో ఉన్న టమాట పంట దెబ్బ తింది.దీంతో చాలా వరకు గ్రామల నుంచి పంట మార్కెట్లకు రావడం ఆగిపోయింది. స్థానికంగా టమాటలు దొరక్కపోవడంతో టమాట ధరలు పెరిగాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం, పది రోజుల్లో టమాట ధరలు రూ.100 వరకు చేరే అవకాశం ఉంది.టమాటనే కిలో రూ.80 ఉంటే మిగిలిన కూరగా యలు కోతి మీరా, పుదీనా కేజీ 180 ఉంది ఎలా కొనాలని సామాన్యులు వాపోతు న్నారు..

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..
    అంతరిక్ష పరిశోధన రంగంలో తెలంగాణ మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్ వేదికగా రూపుదిద్దుకున్న దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ రాకెట్ ఫ్లైట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోటకు జెండా ఊపి పంపారు ముఖ్యమంత్రి రేవంత్…
  • ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..
    సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని…
  • కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది ఎకరాల్లో పండిన వరి పంట కోత దశలో ఉన్నా, డీజిల్ కొరత కారణంగా కోతలు నిలిచిపోతున్నాయి. బంకుల వద్ద రైతులు డీజిల్ కోసం డబ్బాలతో…
  • భద్రాచలంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలకు అవమానం..
    భద్రాచలం పట్టణంలో పంచాయతీ సిబ్బంది అత్యుత్సాహం పెను వివాదానికి దారితీసింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కటౌట్లను డంపింగ్ యార్డ్‌లో పడేసి ఘోరంగా అవమానించారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది చెత్తకుప్పలో పడేయడంపై…
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
    ప్రభుత్వం ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రావిగూడెం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని దీర్ఘకాలిక సమస్యలకు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

008282
Total views : 54239

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.