రోగులకు మెడికల్ సేవలందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆపదలో వచ్చిన వారికి చికిత్స అందించాల్సింది పోయి వారిలో భయం కల్పించి వైద్యం కోసం బేరసారాలు ఆడుతున్నారు. కొందరికి పక్కా గ్యారంటీ ఇస్తూ మరికొందరికి ఇక్కడ కాకుండా మరెక్కడా చికిత్స జరగదనే రీతిలో వైద్యులు చెబుతూ రోగులు, కుటుంబీకుల్లో ఆందోళన కల్పిస్తున్నారు.పేరుకు మెడి స్టార్ ఆస్పత్రి..ఆస్పత్రికి బదులు ఓయో రూమ్స్ నడుపుకుని డబ్బులు సంపాదించాలని బాధితులు ఆస్పత్రి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశంలోని మెడి స్టార్ ఆస్పత్రిలో ఆకాష్ గుప్తా (24) అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాత్రి 200 శాతం ప్రాణానికి గ్యారంటీ ఇచ్చిన వైద్యులు తెల్లవారుజామున మృతి చెందడం పట్ల మృతుని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. నిన్న రాత్రి బైక్ ప్రమాదంలో గాయపడిన ఆకాష్ గుప్తా (24) ను మెడి స్టార్ ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులతో అర్జంట్ గా ఆపరేషన్ చేయాలి అందుకు అధిక మొత్తంలో డబ్బులు అడిగి బేరసారాలు ఆడి డబ్బులు కట్టించుకుని ఆపరేషన్ చేశాక హార్ట్ స్టోక్ వచ్చిందంటూ వైద్యులు కుంటి సాకులు చెబుతున్నారని మృతుని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రాణాలకు గ్యారంటీ ఇచ్చి మృతి చెందడం పట్ల వైద్యుల నిర్లక్ష్యం తోనే ఆకాష్ గుప్తా మృతి చెందాడంటూ ఆస్పత్రి ఎదుట ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని డిమాండ్ చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 89993