106
బంగ్లాదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్ బారి జిల్లాలోని దౌలత్దియా టెర్మినల్ వద్ద 50మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.






Total views : 77372