Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh సర్దార్ వల్లభాయి పటేల్ కి నివాళులు..అనంతరం?

సర్దార్ వల్లభాయి పటేల్ కి నివాళులు..అనంతరం?

by Rama
Run race

జాతి సమైక్యత కోసం సర్దార్ వల్లభాయి పటేల్ చేసిన కృషి అమోఘమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటి పట్టణంలోని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో సర్దార్ వల్లభాయి పటేల్ చిత్రపటానికి ఎంఎల్ఏ శ్రీకాంతం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సమైక్యతా పరుగు 5కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతు సర్దార్ వల్లభాయి పటేల్ స్వాతంత్ర్య యోధుడుగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం దేశంలోని వందలాది సంస్థానాలు ఒకటిగా విలీనం కావడానికి గట్టిగా కృషి చేసి సపలుడైన వీరుడన్నారు. దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన మహనీయుల బాటలో యువత నడవాలని ఎస్ పి కృష్ణారావు తెలిపారు. వల్లభాయి పటేల్ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. యువత, విద్యార్థులు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని పెంపొందించు కోవాలన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013884
Total views : 78308

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.