Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతలు

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతలు

by Satya
Akula Lalith and Dilip Kumar

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలోకి మరికొందరు సీనియర్‌ రాజకీయ నేతలు చేరారు. శుక్రవారం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్‌, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్‌ కుమార్‌తో పాటు పటాన్‌చెరుకు చెందిన బీఆర్ఎస్ నేత నీలం మధు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఖర్గే కాంగ్రెస్‌ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. మరోవైపు, మనుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌ గురువారం రాత్రి మాణిక్‌ రావ్‌ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి చేరిక తమ పార్టీకి ఎంతో బలాన్నిస్తుందని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అవినీతి పాలనను తిరస్కరిస్తున్నారంటూ కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’లో పేర్కొంది.

Advertisements

You may also like

Our Visitor

039464
Total views : 196938

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: