అత్యంత ప్రమాదకరమైన టోలిన్ లిక్విడ్ తో వెళ్తున్న టాంకర్ బోల్తా కొట్టిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. కాకినాడ పోర్ట్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న MH04KF 0706 నంబర్ గల ట్యాంకర్ రోడ్డు పక్కన ఉన్న హై టెన్షన్ కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా కొట్టింది. సమాచారం తెలుసుకున్న పెద్దాపురం పోలీసులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. టోలిన్ లిక్విడ్ తో వెళ్తున్న టాంకర్ బోల్తా. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పెను ప్రమాదం పొంచి ఉందని గ్రహించి మూడు అగ్నిమాపక శకటాలను సంఘటన స్థలంలో ఉంచారు. ఎటువంటి ప్రమాదం జరిగిన నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దాపురం అగ్నిమాపకధికారి జగన్నాధ రావు తెలిపారు. అయితే జన సంచారం లేని ప్రదేశం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ట్యాంకర్ లో ఉన్న 11 టన్నుల లిక్విడ్ గాల్లో కలిసిందని ట్యాంకర్ లో ఉన్న 11 టన్నుల లిక్విడ్ ను ఎయిర్ ప్రెజర్ ద్వారా మరో ట్యాంకర్ కు డంప్ చేస్తున్నారు చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్పై వ్యాఖ్యల వెనుక ఫామ్హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి