56
ముంబైలో మరో పెహల్గామ్ తరహా దాడి జరిగింది. ఓ మతోన్మాది కత్తితో రెచ్చిపోవడం కలకలం రేపింది. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను మతం అడిగి.. కల్మా పఠించమని బలవంతం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. బాధితులు కల్మా చదివమని చెప్పడంతో నిందితుడు జైబ్ జుబేర్ అన్సారీ కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనతో బాధితులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై హత్యాయత్నం కేసుతో పాటు రెండు వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టాడన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. థానే కోర్టులో హాజరుపరచగా మే 4 వరకు పోలీస్ కస్టడీ విధించింది.




Total views : 61542