ప్రకాశం జిల్లాలో సాగర్ జలాల కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చీమకుర్తి గ్రామంలోని పడమర బైపాస్ వద్ద NSP కాలువకు ఇరువైపులా అనుమతి లేకుండా చేపల మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ చేపలను కొనుగోలు చేసిన వారికి అక్కడికక్కడే కోసి శుభ్రం చేసి అమ్ముతుండగా, ఆ వ్యర్థాలను నేరుగా కాలువలో పడేస్తున్నారు. దీంతో సాగర్ జలాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటినే చీమకుర్తి నుంచి సంతనూతలపాడు చెరువులకు, ఒంగోలు నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు, దిగువ ప్రాంత గ్రామాల చెరువులకు తరలిస్తున్నారు. సుమారు ఆరు లక్షల మందికి పైగా ప్రజలు ఈ నీటినే తాగునీటిగా వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చేపల వ్యర్థాలు కాలువలో కలవకుండా అడ్డుకుని, అనధికార చేపల మార్కెట్ను వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చేపల వ్యర్థాలతో సాగర్ జలాలు కలుషితం అవుతున్న ఘటన ప్రకాశం జిల్లాలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. చీమకుర్తి పడమర బైపాస్ వద్ద ఉన్న NSP కాలువ పక్కనే అనుమతి లేని చేపల మార్కెట్ కొనసాగుతోంది. మార్కెట్లో చేపలను శుభ్రం చేసిన తర్వాత మిగిలే వ్యర్థాలను కాలువలోనే పడేస్తుండటంతో నీటి నాణ్యత పూర్తిగా దెబ్బతింటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు వినియోగిస్తున్న నీరు కలుషితం కావడంతో అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా విషపూరిత జ్వరాలు, కిడ్నీ సమస్యలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర అనారోగ్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.





Total views : 90047