అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ ప్రస్తుతం భారత్లో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె నారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని అద్భుత శిల్పకళ, నిర్మాణ వైభవాన్ని చూసి టిఫానీ ట్రంప్ మంత్రముగ్ధులయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఇటీవల ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన నీలకంఠ్ వర్ణీ విగ్రహాన్ని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్శనకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుని, ఆలయ సౌందర్యంపై ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా టిఫానీ త్వరలో ఆగ్రాకు వెళ్లి ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ను సందర్శించనున్నారు. అక్కడ సుమారు గంటన్నర పాటు గడిపిన అనంతరం జైసల్మేర్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదే అయినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాగా, టిఫానీ ట్రంప్కు ఇది తొలి భారత పర్యటన కాదు. 2018లో తండ్రి డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆమె కూడా భారత్కు వచ్చారు.
భారత్లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్..
22
previous post





Total views : 90017