236
కర్నాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలో అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది. పొన్నంపేట తాలూకాలోని కోణనకట్టే ప్రాంతంలో కాఫీ తోటను పరిశీలించేందుకు వెళ్లిన రిటైర్డ్ ఐజీపీ కుటుంబ సభ్యులపై అడవి ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో రిటైర్డ్ ఐజీపీ భార్య తీవ్రంగా గాయపడి మృతి చెందారు.ఏనుగు దాడిని గమనించిన కార్మికులు ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. ఘటన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అడవి జంతువుల సంచారంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.