టేకాఫ్ చేసేందుకు రన్వేపైకి వస్తుండగా ఓ విమానం టైరు అకస్మాత్తుగా పేలిపోయింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన వెలుగు చూసింది. ఫినిక్స్ నగరానికి వెళ్లే అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్ 590 విమానం ఫ్లోరిడాలోని టాంపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
టేకాఫ్ కోసం టాక్సీ వే మీద నుంచి రన్వే మీదకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పేలడంతో విమానం చక్రాల్లోంచి ఒక్కసారిగా నిప్పురవ్వలు, పొగలు విరజిమ్మాయి. కొన్ని క్షణాల తరువాత విషయన్ని గుర్తించిన పైలట్ వెంటనే టేకాఫ్ ప్రయత్నాన్ని విరమించాడు. ఘటన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అయితే, వారెవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగలేదని, విమానాశ్రయ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదని అమెరికా పౌర విమానయాన విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మరో విమానంలో వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు పేర్కొంది. కాగా, ఒకటికి మించి విమానం టైర్లు పేలినట్టు అనుమానాలు వ్యక్తం కావడంతో ఘటనపై దర్యాప్తు చేస్తామని వెల్లడించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కందుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములపై పొలిటికల్ రచ్చప్రభుత్వ భూముు ఎక్కడున్నా.. కబ్జాదారుల కళ్లు వాలిపోతున్నాయి. నయాన్నో, భయాన్నో వాటిని కాజేసేందుకు కుట్రలు మొదలవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడిలో ఇలాగే దేవాలయ భూములపై రాజకీయ నేతల కన్ను పడింది. లీజు రూపంలో వాటిని కబళించేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి.…
- జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదంజమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్–రామ్నగర్ మార్గంలోని జాలో ప్రాంతంలో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20కి చేరింది మృతుల సంఖ్య. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…
- సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి…
- ‘ఓం శాంతి డిస్కో శాంతి’ ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’. టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల…ఆనందో బ్రహ్మ, సేవ్ ది టైగర్స్ వంటి ఎంటర్టైనర్స్ సృష్టికర్త మహి వి.రాఘవ్ నుంచి రాబోతున్న మరో సరికొత్త కామెడీ హారర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ క్యాప్షన్. మరోసారి ప్రేక్షకులను…
- తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు ..తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 46162