Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మల..

వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మల..

by Rama
chinna rajappa

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కాపుల సంక్షేమన్ని పూర్తిగా అటకేక్కించింది అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో 1.50 కోట్లతో ఆధునీకరించిన తెలగ కల్యాణ మండపం ను మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప తో కలసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ కు కేటాయించ వలసిన నిధులు కేటాయించలేదని విదేశీ విద్యను పూర్తిగా అటకెక్కించారని వచ్చే టిడిపి జనసేన రావడం అధికారులకు వచ్చిన వెంటనే అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు కాపుల విదేశీ విద్య పునరుద్దిస్తామని ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాకముందు కాపు కార్పొరేషన్ కు సంవత్సరానికి రెండూవేల కోట్లు కేటాయిస్తానని ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు. అలాగే ఐదు శాతం రిజర్వేషన్ జీవోను దుయ్యబట్టారు రానున్న టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో కాపుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారికి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ టిడిపి ప్రభుత్వం జీవో విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదని కాపులు అందరూ రిజర్వేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు.

Advertisements

You may also like

Our Visitor

025831
Total views : 149263

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.