చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల క్రాస్ వద్ద ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు . షిఫ్ట్ కారులో తరలిస్తున్న 13 దుంగలను స్వాధీనం చేసుకొని, ఒకరి అరెస్టు చేసారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. పక్కా సమాచారంతో 30 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను వెంటాడి పట్టుకున్నమని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
Chittoor
కాసేపట్లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభం కానుంది.. నిజం గెలవాలి పేరుతో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో మూడు రోజుల పర్యటించన్నారు నారా భూవనేశ్వరి .. నేటికి 47 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు… అరెస్టును ఖండిస్తూ నిజం గెలవాలి కార్యక్రమం.. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. ఉదయం 10.30 గంటలకు నారావారిపల్లె నుంచి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లనున్న భువనేశ్వరి.. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆవేదన చెంది గత నెల 25న చనిపోయిన పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ కుటుంబాన్ని పరామర్శిచనున్న భువనేశ్వరి.. అనంతరం ఈ నెల 17న మరణించిన చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శ మధ్యాహ్నం 3 గంటలకు అగరాలలో చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి… రేపు తిరుపతి, శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం..
తిరుపతి బహిరంగసభ ( Public Meeting ) :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు..
Follow us on : Facebook, Instagram & YouTube.
చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక, రేపు నారావారిపల్లి నుంచి నిజం గెలవాలి బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో నారా భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆమె మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలోను భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26న తిరుపతిలో వారిని పరామర్శించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగసభలోను ఆమె ప్రసంగిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి అశ్వ వాహనం తిరుమాడవీధులో అశ్వ వాహనం పై శ్రీమలయప్పస్వామి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం కల్కి అలంకరణలో కలియుగ వైకుంఠంలో శ్రీనివాసుడు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి ఇంద్రియ నిగ్రహం వున్న చోటే ఆద్యాత్మిక వికాసం ఇంద్రియాలను జయించిన వారే భగవంతుని చేరుతారు పార్దసారధిగా భగవద్గీత బోధించిన శ్రీకృష్ణుడు ఇంద్రియాలనే గుర్రాలను పూన్చిన రధమే మన దేహం ఆ రధాన్ని నడిపించే పరమాత్మే నేడు అశ్వ వాహనుడు అశ్వ వాహనంపై స్వామి తెలుపుతున్నది ఇంద్రియ నిగ్రహం కల్కి అవతారంలో… అశ్వవాహనారూఢుడై స్వామి అశ్వ వాహనంపై తిరుమలలో విహరిస్తున్న శ్రీ వేంకటేశ్వరుడు భక్తులకు కలిదోషాలు లేకుండా చేసేందుకే కల్కి అవతారం తిరుమాఢవీధుల్లో అశ్వముపై దర్శనమిస్తున్న శ్రీనివాసుడు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు
అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 చంద్రగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. కాబట్టి అక్టోబర్ 28న రాత్రి గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున జరుగనున్న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రి 7:05ని.లకు ఆలయ తలుపులు మూసివేసి తిరిగి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు.
భక్తుల కానుకలు, ముడుపులతో టిటిడి ఖజనా నింపుకుంటున్న పాలక మండలి నిర్ణయం సరైనది కాదు అన్నారు బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ టిటిడి నిధుల్ని తిరుపతి అభివృద్ధి కోసం మున్సిపాలిటీ మళ్ళించడంను వ్యతిరేకిస్తున్నాం.. ఈ నిర్ణయంపై విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకిస్తూ అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తున్నాం.. టిటిడి నిధుల్లో ఒక్కశాతం అంటే, ఏడాదికి యాభై కోట్లు, శానిటరీ పేరుతో మరో యాభై కోట్లు దారి మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం టిటిడి నిధులను తిరుపతి మున్సిపాలిటీ మళ్ళించడం లేదంటూ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషం.. స్వార్ధ రాజకీయాలు,స్వార్ధ ప్రయోజనాల కోసం ఎవరినో దృష్టిలో పెట్టుకుని టిటిడి నిధులను దారి మళ్ళించేందుకు ప్రయత్నించారు.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే శ్రీవారి భక్తుల ఆగ్రహంకు గురి కాక తప్పదన్నారు భానుప్రకాష్ రెడ్డి.





Total views : 81811