Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home TelanganaMahabubnagar బి ఎస్ పి ఇంటింటి ప్రచారం

బి ఎస్ పి ఇంటింటి ప్రచారం

by Rama
BSP

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వివిధ గ్రామాలలో ప్రచారం చేసిన బహుజన్ సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బసిరెడ్డి సంతోష్ రెడ్డి.. ఇంటింటికి వెళ్లి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బహుజన సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య వైద్యం కల్పిస్తామన్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ లకు ఓటు వేస్తే బహుజనుల బతుకులు మారవన్నారు. పేద ప్రజలకు న్యాయం జరగాలన్న, బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం రావాలన్న బహుజన సమాజ్వాది పార్టీతోనే సాధ్యమన్నారు. కావున దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బసిరెడ్డి సంతోష్ ప్రజలకు పిలుపునిచ్చారు..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013883
Total views : 78287

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.