పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో డొక్కా సీతమ్మ మొబైల్ క్యాంటీన్ ద్వారా నిత్యం పేదల ఆకలి తీరుస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళి కృష్ణ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారని ఆ స్ఫూర్తి తో పేదల ఆకలి తీర్చిందుకు పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు నుండి ప్రారంభించిన ఈ మొబైల్ క్యాంటీన్ నిత్యం నరసాపురం బస్టాండ్ సెంటర్ లో ప్రయాణికులు, ఆటో,రిక్షా కార్మికులకు భోజనం సమకూరుస్తుమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా నడపడానికి అనేక మంది యువత సహకరిస్తున్నారని అన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో వందలాది మంది ఆకలి తీరుస్తున్నమన్నారు.