ఆలయంలో పురాతన రాతి మండపాలు ఏవి తొలగించలేదని, 1956 లో పోటుకు అనుబంధంగా ఏర్పాటు చేసుకున్న స్షోర్ రూమ్ సిమెంట్ కట్టడం శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని తొలగించి అక్కడ ఆశీర్వాద మండపముగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వాస్తవాలకు విరుద్ధంగా పురాతన కట్టడాలు కూల్చివేసినట్టు మాట్లాడడం తగదు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయం లోపలికి ఫోన్లు తీసుకెళ్లి సెల్ఫీలు చిత్రీకరించుకోవడం తగదని దీనిపై సంబంధిత అధికారులపై డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటామని, అధికారుల వివరణ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సుధీర్ రెడ్డి పై తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రెండేళ్ల క్రితమే పోటు వద్ద ఉన్న స్టోర్ రూమ్ స్థానంలో ఆశీర్వాద మండపం చేయాలని ధర్మకర్తల మండలి తీర్మానించిందని తెలిపారు. తమ ధర్మకర్తల మండలి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి క్షేత్ర ప్రతిష్ట పెంచే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని అసంబద్ధమైన ఆరోపణలతో ఆలయ ప్రతిష్ట రాజకీయాల కోసం దెబ్బతీయొద్దని కోరారు. స్టోర్ రూమ్ సిమెంట్ కట్టడం తొలగింపులో విగ్రహాలు ఏమీ లేవని, ఆగమ విరుద్ధమైన పనులు ఏమీ చేయలేదని దీనిపై ప్రమాణం చేయడానికి బొజ్జల సుధీర్ రెడ్డి రావాలని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సవాల్ చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి స్వగ్రామంలోని నీలకంటేశ్వర స్వామి ఆలయానికి మహా కుంభాభిషేకం తమ హయాంలోనే చేస్తున్నామని గుర్తు చేశారు. గత 40 ఏళ్లు గా నిరాధారణకు గురైన అనుబంధ ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తున్నామని తెలిపారు. స్వామి వారి డిపాజిట్లు 236 కోట్లు ఉందని, వాస్తవాలు తెలుసుకొని సుధీర్ రెడ్డి మాట్లాడాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ అమలు అత్యంత ఆవశ్యమని, దీనిపై మరో వారం రోజుల్లో ఉన్నత స్థాయి సమావేశం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్వహించనున్నట్లు తెలిపారు. రద్దీ సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా శివయ్య గోపురం వద్ద 45 లక్షలతో వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా రాహు కేతు పూజ మండపాలని ఆలయ ప్రాకారంలోకి తీసుకువచ్చి టైం స్లాట్ విధానం కూడా అమల్లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ వేద పండితులు అర్ధగిరి మాట్లాడుతూ ఆలయం లోపల ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. అనుభవం లేని కాంట్రాక్టర్లు దేవస్థానంలో పనులు చేయడం లేదని, ఊరందూరు నీలకంటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తి అనుభవం ఉన్న కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్పష్టం చేశారు. రాజకీయాలకతీతంగా ఆలయ ప్రతిష్ట పెంచే విధంగా వ్యవహరించాలని, మన ఆలయం మన క్షేత్రం ప్రతిష్ట కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సుధీర్ రెడ్డి తెలుసుకోవాలని హితవు చెప్పారు. అదేవిధంగా మీ తండ్రి గారు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు ఏ ఒక్క రోజైనా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఎన్ని దేవాలయాలు కట్టించారు అని చెప్పండి. మా శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 116 శ్రీరామ మందిరం లూ రాష్ట్ర ప్రభుత్వం చే నిధులు మంజూరు చేశారు అది కూడా నిర్మాణాలు కూడా పూర్తి అయ్యింది తెలియజేసినారు. మీరు గాని మీ యొక్క నాయకులు ఏ రోజైనా విరాళాలని సమకూర్చి అభివృద్ధికి కృషి చేసారా.ఈ విలేకరుల సమావేశంలో ధర్మకర్త మండలి సభ్యురాలు సుమతి, ఆలయ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్,ఈఈ నూకరత్నం, డిప్యూటీ ఈఓ వెంకటసుబ్బయ్య, ధనపాల్, ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, వేద పండితుల అర్ధగిరి, మారుతి శర్మ, ప్రభాకర్ శర్మ, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Devotional
6.47 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం…సంతృప్తికరంగా దర్శించుకున్న భక్తులు
ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 లక్షల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో ఎ వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. దర్శించుకున్న భక్తులతోపాటు అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందని చెప్పారు. భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేశామన్నారు. 10 రోజులకు కలిపి విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామని, 18,578 మంది హాజరుకాగా, 677 మంది(3.3 శాతం) గైర్హాజరయ్యారని తెలిపారు. దాతలకు బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నారని, 6,388 మంది హాజరుకాగా, 470 మంది(7 శాతం) గైర్హాజరయ్యారని వివరించారు. శ్రీవాణి దాతలకు మొత్తం 20 వేల ఎస్ఇడి టికెట్లు జారీ చేశామని, 19,083 మంది హాజరుకాగా, 917 మంది(4.5 శాతం) గైర్హాజరయ్యారని తెలియజేశారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారని, 1,97,524 మంది హాజరుకాగా, 27,476 మంది(12.2 శాతం) గైర్హాజరయ్యారని తెలిపారు. సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు మొత్తం 4.23 లక్షలు మంజూరు చేశామని, 3,24,102 మంది హాజరుకాగా, 90,850 మంది(21.5 శాతం) గైర్హాజరయ్యారని వెల్లడించారు. అదేవిధంగా, ఈ పది రోజులకు కలిపి రూ.40.20 కోట్లు హుండీ కానుకలు అందాయని, 17.81 లక్షల మంది అన్నప్రసాదాలు, 35.60 లక్షల మంది లడ్డూ ప్రసాదాలు స్వీకరించారని, 2.14 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో తెలియజేశారు. అలిపిరి పాదాల మండపం వద్దగల రాతిమండపం కూలిపోయే స్థితికి చేరుకుందని, దీని పునర్నిర్మాణానికి సంబంధించి భారత పురావస్తు శాఖకు పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని తెలిపారు. నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి ఆలయ గోడ కూలిందని, దీనికి సంబంధించి పురావస్తు శాఖకు లేఖలు రాసినా స్పందించడం లేదని చెప్పారు. రాతిమండపాలు, ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణ విభాగం ఉందని, ఇక్కడ నిపుణులైన స్థపతులు ఉన్నారని వివరించారు. ఎస్వీ శిల్ప కళాశాల ఆధ్వర్యంలో ఎంతో మంది నిపుణులను తయారవుతున్నారని, వీరు విగ్రహాల తయారీతోపాటు, చక్కగా ఆలయాలు నిర్మించగలరని తెలియజేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్, వైజాగ్, హైదరాబాద్, ఒడిశా, కన్యాకుమారి, సీతంపేట, రంపచోడవరం ప్రాంతాల్లో అత్యంత సుందరంగా రాతి కట్టడంతో ఆలయాలు నిర్మించామని వెల్లడించారు. అలిపిరి నడకమార్గంలో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించినపుడు వెంటనే భక్తులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర అటవీశాఖకు రూ.3.5 కోట్లు అందించామని, దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాల కొనుగోలుతో పాటు ఇతర చర్యలు చేపడతారని చెప్పారు.
హనుమాన్ మహా పరాక్రమవంతుడు, అపజయమే ఎరుగనివాడు. శత్రువులను సంహరించడంలోను భక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. ఆయన పేరు వింటేనే భూత ప్రేత పిశాచాలు కంటికి కనిపించనంత దూరం పారిపోతాయి. అంతటి శక్తిమంతుడైన ఆంజనేయుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు. అలా ఆవిర్భవించిన ఆలయమే శ్రీ తాడ్ బండ్ వీరాంజనేయ ఆలయం. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ , వైశాఖ బహుళ దశమినాడు జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది దీక్షాపరులు, భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి త్రేతాయుగంలోనే ఇక్కడ స్వామి స్వయంభువుగా ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు. 19 శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేయడంతో, అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయసహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి. మరి ఈ ఆలయ విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామితాడ్ బండ్ ప్రాంతంలో నెలకొన్న శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం స్వయంభువుడని ప్రతీతి. మొగలులు, రాజపుత్రులు, కుతుబ్ షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెబుతుంటారు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే హనూమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకంపై ఉంటుంది. నవ వ్యాకరణంలో చివరి నాలుగు అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్ఛితంగా గృహస్తుడై ఉండాలని, ఇందుకోసం తన కమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని స్వామివారికి గురువైన సూర్యుడు సూచిస్తాడు. ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామికానీ, ఆపై బ్రహ్మచారిగానే కొనసాగాడు. ఇక సువర్చల స్వామివారి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపేస్తుంది. వీరిద్దరి ప్రతిమలు ఇక్కడ మనకు గోచరిస్తాయి. గర్భాలయం మొత్తంను గ్రానైట్ రాయితో నిర్మించారు. ముఖమండపం విశాలంగా ఉంటుంది. విమాన గోపురం, మహారాజ గోపురాలతో శోభాయమానంగా ఉంటుంది. 40 రోజులపాటు జరిగే మండల దీక్షలు, మండల ప్రదక్షిణాలు, మండల అభిషేకాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పొరుగు ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామిమండల ప్రదక్షిణాలు మరియు పూజల కోసం ప్రత్యేకంగా నలభై రోజులపాటు ఇక్కడే ఉండాలని కోరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాకులు పలు సత్రాలను నిర్మించారు. సత్రాలతో పాటు భోజనశాలలు తదితర సౌకర్యాలు ఈ మందిరంలో భక్తుల కోసం ఏర్పాటు చేశారు. ఈ ఆలయం రజత, బంగారు జూబ్లీ ఉత్సవాలను కూడా జరుపుకుంది. ప్రతి మంగళ, శనివారాలలో ఇక్కడ కోలాహలం మాములుగా ఉండదు. వేల సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తరలివస్తుంటారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని రకాల వసతులను విస్తృతంగా ఏర్పాటు చేస్తారు. తాడ్ బండ్ వీరాంజనేయ స్వామివాహన పూజకు ఈ ఆలయం బాగా ఫేమస్. తక్కువ సొమ్ముతో పెళ్ళి వేడుకలు, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు నిర్వహించుకునేందుకు ఓ కళ్యాణ మండపం కూడా ఉంది. కళ్యాణ మండపం అద్దెకు తీసుకున్నవారికి అధిక గదులు కేటాయిస్తారు.
Read Also..
Read Also..
పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి. క్రీ.శ. 8వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయానికి ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడుకు గల ‘రాజాదిత్య’ బిరుదు నుండి ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయనం అని పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు. చారీత్రాత్మకంగా వేములవాడ ఒక అతి పురాతనమైన ఆలయం. చాళిక్యుల కాలంలో ఈ క్షేత్రం మహామహివాన్విత క్షేత్రంగా వెలుగొందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయం చుట్టూ వున్న దేవాలయాలను నిర్మించడానికి ఆనాటి చాళిక్యుల కాలంలో సుమారు 220 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు.
ఆలయ విశేషాలు :
శివరాత్రి పర్వదినం సందర్భంగా 100 మంది అర్చకులతో ఈ మహాలింగానికి అర్చన చేయబడుతుంది. ఇక్కడ భక్తులు నిర్వహించుకునే ప్రధాన పూజలలో కోడెముక్కు ఒకటి. ఈ పూజలో మొదటగా భక్తులు ఒక గిత్తను తీసుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో దానిని కట్టేసి, దక్షిణగా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఈ పూజను నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులుఇలా రకరకాల జాతులకు చెందినవారు ఈ ఆలయాన్ని తరుచూ సందర్శిస్తారు. ఈ దేవాలయంలో వున్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయంలో ఇంకొక విశిష్టమైన అంశం వుంది. ఈ ఆలయ ప్రాంగణంలో 400 సంవత్సరాలనాటి పురాతన మసీదు వుంది. పూర్వం ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తులు ఈ ఆలయంలోనే వుంటూ నిత్యం స్వామివారిని సేవిస్తుంటేవాడట. అతని మరణం కూడా ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. అలా అతని పేరు మీద ఇక్కడ మసీదును నిర్మించడం జరిగింది.
ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్ రైలు స్టేషన్ కి మూడు కిలోమీటర్ల దూరంలోని మట్టెవాడ ప్రాంతంలో వుంది. ఈ ఆలయానికి ‘భోగేశ్వరాలయం’ అనే పేరు రావడం వెనుక ఓ పురాణ కథ అమలులో వుంది. ప్రతిరోజూ రాత్రిపూట ఒక పాము ఇక్కడికొచ్చి ఈశ్వరుని సేవించేదట. పానవట్టముమీద పైనున్న లింగభాగాన్ని జరపటానికి వీలుగా వున్నది. దాని క్రింది భాగం బోలుగా వుంటుంది. ఇక్కడ అడుగుభాగంలో శివలింగం కింద మేరు ప్రస్తారంలో శ్రీ చక్రం వుందట. శీచక్రం బిందుస్ధానంలో మరొక చిన్న రాతి శివలింగం వుంది. అక్కడ ఒక పెద్ద శ్రీ చక్రము, ఆ శ్రీచక్రబిందు స్ధానంలో ఒక లింగము, శ్రీ చక్రాన్ని కప్పివేస్తూ నిర్మించిన పెద్దపానవట్టము, ఆ పానవట్టముమీద కదల్చటానికి వీలుగా చెక్కిన మరొక శివలింగము వున్నాయి. దానికింద పదకొండు శివ లింగాలు వున్నాయని, అందుకే ఈ భోగేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకంచేస్తే ఏకాదశరుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందంటారు. ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఎన్ని బిందెలనీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసినా ఆ నీరు ఒక్క చుక్కైనా బయటికి రాదు ఎక్కడికి పోతుందో కూడా తెలీదు. ఈ లింగానికి వెనుక భాగంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కూడా ప్రతిష్టించబడింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయం ప్రసిద్ధి చెందకపోవడానికి కొన్ని వాస్తుదోషాలు వున్నాయని చెబుతారు. స్వామి ఉత్తర ముఖంగా వున్నాడు. అంటే పూజించేవారు దక్షిణ ముఖంగా వుండి చెయ్యాలి. అది శాస్త్ర సమ్మతం కాదంటారు. నైఋతిలో బావి వుందన్నారు కానీ వాస్తుదోషం కారణంగా దానిని మూసేశారుట. ఆలయ ప్రవేశద్వారం ఈశాన్యంలో వున్నది. ఇదికూడా వాస్తు శాస్త్ర విరుధ్ధమే. ఈ ఆలయంలో శివరాత్రి వగైరా పర్వదినాలలో ప్రత్యేక పూజలే కాక మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంరోజున ద్వార దర్శనం వుంటుంది.
తిరుమలలో నూతన సంవత్సర వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీవారి ఆలయం, ఆలయ పరిసర ప్రాంతాలంతా విద్యుత్ దీపాలంకరణలతో దగదగా మెరిసిపోయాయి. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 కు స్వాగతం పలుకుతూ 12 గంటల సమయంలో భక్తులు ఆలయం ఎదురుగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొట్టారు. గోవింద నామస్మములతో భక్తులు 2024 ను స్వాగతించారు. ఒకరికొకరు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని తినిపించుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఈ ఆలయ నిర్మాణం ఎంతో ప్రాచీనమైనది. ప్రాచీన మధురై నగరానికి సంబంధించిన భౌగోళిక, సంప్రాదాయిక ఆచారాలను కలిగి వుంటూ ఒక కేంద్రంగా గుర్తించబడుతుంది. ఈ ప్రాచీన ఆలయానికి చుట్టూ వుండే గోడలు, వీధులు, నగర గోడలు చతురస్రాకారంలో నిర్మించబడి వుండేవి. నాలుగు ముఖాలతో ప్రవేశ ద్వారాలతో కలిగిన ఆలయాలో తమిళనాడులో వుండే అతికొద్ది దేవాయాల్లోనే ఇది ఒకటి. ఆలయ సముదాయం 45 ఎకరాలతో గుండ్రంగా వుండి, 254/237 మీటర్లతో పొడవున భారీ నిర్మాణంగా వుండేది. అప్పటిలో ఈ ఆలయానికి 12 గోపురాలు వుండేవి. పురాతన ఆలయం అయిన ఇందులో ఎందరో దేవతల సముదాయం వుండేది. అందులో ముఖ్యంగా శివాలయం ఆలయ సముదాయానికి నడిబొడ్డులో వుండేది. అలాగే ఆలయానికి వెలుపల ఏకశిలపై మలిచిన గణేశుని భారీ విగ్రహం వుంది. దీనిని ముఖురుని వినాయకర్ అని పిలుస్తారు. మీనాక్షీ విగ్రహం శివు విగ్రహానికి ఎడమవైపున వుంది. ఆలయ ప్రత్యేకతలు ఆలయానికి నలువైపులా నాలుగు ఎత్తైన రాజు గోపురాలు ఎంతో గంభీరంగా దర్శనమిస్తాయి. తూర్పు – పశ్చిమ దిశగా వున్న గోపురాలను 13, 14వ శతాబ్దాలలో సుందరపాండ్యన్, పరాక్రమ పాండ్యన్ అనే ఇద్దరు పాలకులు నిర్మించారని అదేవిధంగా దక్షిణ గోపురాన్ని శివ్వంది చెట్టియార్ అనే పాలకుడు 16వ శతాబ్దంలో నిర్మించినట్టు స్థలపురాణం పేర్కోబడుతోంది. దక్షిణవైపుగా వున్న గోపురం సుమారు 160 అడుగుల ఎత్తు వుంది. ఈ ఆలయంలో సుందరేశ్వర స్వామి, మీనాక్షీ అమ్మవారు మొదలగు దేవతలు కొలువై వున్నారు. మధురై ప్రాంతంలో వున్న సంస్కృతీ – సంప్రదాయాల ప్రకారం ఆలయానికి తూర్పువైపున వున్న అష్టలక్ష్మీ మండపం ద్వారా లోపలికి ప్రవేశం చేసి, మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ ప్రవేశ ద్వారంపై అమ్మవారి ఘట్టాలు శిల్పాల రూపంలో ఎంతో అందంగా చెక్కబడి వున్నాయి. అలాగే స్వర్ణ కమల తటాకం కూడా ఎందో ఆకర్షణీయంగా వుంటూ భక్తులను ఎంతో ఉత్సాహపరుస్తుంది. ఆలయ సముదాయంలో వుండే రెండుబంగారు గోపురాలతోపాటు 14 అద్భుతమైన గోపురాలకు ముఖ్యదేవతలకు నిలయంగా వుంది.
Read Also..
Read Also..
నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిటలాడాయి. ఏపీలోని తిరుమల, శ్రీశైలం, సింహాచలంతో పాటు తెలంగాణలో యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతరప్రాంతాల నుంచీ తరలివచ్చారు. స్వామివారి కృపాకటాక్షాలు తమపై ఉండాలని ప్రార్థించారు. దీంతో శ్రీవారి ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. శ్రీవారిని కేంద్రమంత్రి కిషన్రెడ్డి దంపతులు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. వారికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు గవర్నర్ తమిళిసై తెలిపారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. కొత్త ఏడాది తొలి రోజు కావడం, మేడారం జాతరకు ముందుగా భక్తులు రాజన్నను దర్శించుకోవడానికి వస్తుండడంతో గర్భాలయంలో ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు.. స్వామి వారికి కోడె మొక్కులను చెల్లించుకుంటున్నారు. అనంతరం స్వామివారి దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని విశేష పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం కలిసి రావాలంటూ వేడుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
శివుడు అభిషేక ప్రియుడు. కలశంతో మంచి నీటి అభిషేకం చేసిన పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కోరిన కోర్కెలను నెరవేరుస్తాడు. అలా అని అభిషేకం ఎలా పడితే అలా చేయకూడదు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా పవిత్రమైన మహాశివరాత్రి నాడు శివుడిని ఆరాధించేటప్పుడు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అప్పుడే పుణ్యఫలం దక్కుతుంది. తెలిసీతెలియక తప్పులు చేస్తే అభిషేకం చేసిన పుణ్యం కూడా దక్కదు. ఉత్తర దిశను శివుడి ప్రధాన ద్వారంగా భావిస్తారు. కాబట్టి శివ లింగానికి నీటిని అభిషేకించేటప్పుడు ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ముఖం ఉంచాలి. ఈ దిశను అర్ధనారీశ్వరుడి ఎడమవైపుగా భావిస్తారు. స్టీల్ గిన్నె లేదా మట్టి పాత్రల్లో తీసుకునే అభిషేకించాలి. మహాశివరాత్రి నాడు కొంతమంది పాల ప్యాకెట్లతో అభిషేకం చేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అలాగే కూర్చొని మాత్రమే అభిషేకం చేయాలి.పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకం చేసినప్పటికీ చివరగా నీటితో అభిషేకం చేయడం చాలా ముఖ్యం. అప్పుడే అభిషేక ఫలితం దక్కుతుంది. నీటితో అభిషేకం చేసేటప్పుడు అందులో పూలు, గంధం వంటివి ఏవీ కలపకూడదు. స్వచ్ఛమైన నీటితోనే అభిషేకం చేయాలి. అలాగే శివుడికి శంఖంలో నీటిని తీసుకుని ఎప్పుడూ అభిషేకించకూడదు.
మంత్రులుగా తాను సీతక్క ఇద్దరం రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర సహా సంక్రాంతికి ఐనవోలు, కొమురవెల్లి జాతరలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఏమో కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరల నిర్వహణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కొండ సురేఖ. స్వామివారి దర్శనానికి వచ్చిన సురేఖకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణ సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.