ఎన్టీఆర్ జిల్లా మైలవరం, భక్తుల కు ఎంతో ప్రీతిపాత్రమైన ముక్కోటి ఏకాదశి ని పురస్కరించుకొని మైలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర ద్వారదర్శనం లో కనువిందు చేసారు. తెల్లవారుజామున నుండి భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వారదర్శనం లో వీక్షించేందుకు బారులు తీరారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీర్ద ప్రసాదాలు అందజేశారు.
Devotional
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో దివ్య ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామి వారి గిరి ప్రదక్షిణ సేవ భక్తులను అలరించింది. గజలక్ష్మి గుర్రాలు గోమాత ముందు నడుస్తుంటే ప్రచార వాహనంపై కొలువు తీరిన స్వామి వారు ఉభయదేవేరులు, కలిసి క్షేత్రపురవీథుల్లో ఊరేగారు. స్వామివారి పాతిక మండపం నుండి ఆలయం చైర్మన్ నివృత రావు, ఈవో వేండ్ర త్రినాథరావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రచార వాహనం కొలువు తీరిన స్వామివారి అమ్మవారు ప్రత్యేక అలంకరణతో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాన్ని ముందు కదిలించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోలాట భజనలు కేరళ డప్పులతో శక్తి వేషధారణలతో భక్తులను అలరించారు. వెంకటేశ్వర స్వామి వారి వేషధారణ చేసిన ఇంత ఆకర్షణీయంగా ఉండటం మరో ప్రత్యేకత వివిధ దేవతల అవతారాల రూపంలో వేషాలను వేసి గిరి ప్రదిక్షణలో పాల్గొన్న భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. గిరిప్రదక్షిణ వాహనంపై స్వామి అమ్మవార్లతో పాటు ఆలయ అర్చకులు ప్రత్యేక మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి వారి గిరిప్రదక్షిణ సుమారు 6 కిలోమీటర్లు జరిగింది. ఆలయ తొలిమెట్టు వద్ద పలువురు స్వామి అమ్మవార్లకు హారతులని ఇచ్చారు. అనంతరం క్షేత్రంలో తిరుగాడి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హారతులు సమర్పించారు. ఈ ఉత్సవం ఆద్యంతం భక్తులను విచిత్ర వేషధారణలు, నృత్యాలు, భజనలు, శక్తి వేషలు వెంకటేశ్వర స్వామి వివిధ దేవుళ్ళ వేషధారణలు ప్రత్యేకముగా విశేషంగా ఆకట్టుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు – భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు యాగం నిర్వహించారు. రేపు, ఎల్లుండి కూడా యజ్ఞహోమాది కార్యక్రమాలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. గుత్తి పట్టణంలో కన్నులపండుగగా శ్రీరామ శోభాయాత్ర జరిగింది. జనవరి నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా గుత్తిలో శ్రీరాములవారి అక్షితల విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పురాతన రామాలయం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. యాత్ర దేవాలయం నుండి గాంధీచౌక్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా సాగింది. మండలంలోని ప్రతి గ్రామానికి స్వామివారి అక్షితలను కమిటీ సభ్యులు అందజేశారు.
శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ షెడ్లు నిండిపోయాయి. దీంతో సర్వదర్శనానికి కంపార్ట్ మెంట్ల లోపలికి భక్తులను అనుమతించడంలేదు. ఇప్పటి వరకు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న వారికే మాత్రం దర్శనం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈరోజు సర్వదర్శనానికి అనుమతించక పోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులను క్యూలైన్ల ప్రారంభం వద్దనే పోలీసులు అడ్డుకుంటున్నారు. సర్వదర్శనానికి ఎందుకు వెళ్లనీయడం లేదని భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రస్తుతం క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఇవాళ రాత్రికి దర్శనం లభించే అవకాశం ఉంది.
Read Also..
Read Also..
అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ గురించి చాలా మందికి తెలిసిందే. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలాల్లో ఒకటి. ఈ గురుద్వార గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. పంజాబ్లోని ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలాల్లో ఒకటి. అలాగే సిక్కుల ప్రధాన గురుద్వార్ కూడా ఈ స్వర్ణ మందిరమే. దీంతో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి కేవలం సిక్కులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎవరైనా ఈ ఆలయ సముదాయంలోకి అడుగు పెట్టగానే ఎక్కడా దొరకని ప్రశాంతత ఆవహిస్తుంది. ఈ గోల్డెన్ టెంపుల్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా పేరుగాంచింది. తిరుమల శ్రీవారిని నిత్యం వాలేది మంది భక్తులు దర్శించుకున్నట్లే ఇక్కడికి కూడా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీ టూరిస్టులు సైతం ఎంతో మంది వచ్చి ఈ గురుద్వారను సందర్శిస్తుంటారు. ఈ గురుద్వారకున్న ప్రత్యేకమైన ఆకర్షణే బంగారు తాపడం. ఈ మందిరం చుట్టూ 24 క్యారెట్ల బంగారు పూతను అద్దడం విశేషం. దీంతో ఈ ఆలయానికి స్వర్ణమందిరం అనే పేరొచ్చింది. మహారాజా రంజిత్ సింగ్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఆలయానికి బంగారం జోడించాలని అనుకున్నారు. అలా మొదట 162 కిలోల బంగారు పూతతో ప్రారంభించగా 90ల కాలంలో 500 కిలోల బంగారు పూతను ఆలయానికి అతికించారు. దీంతో ఈ గురుద్వార దగదగలాడుతుంది. ఈ గోల్డెన్ టెంపుల్లో నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజన ఏర్పాట్లు చేస్తుంది. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లంగర్ సేవను అందిస్తున్న దేవాలయంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక్కడికి వచ్చే భక్తులూ, టూరిస్టులు ఎవరైనా సరే నేల మీద కూర్చొనే ఆహారం తీసుకుంటారు. ఇక్కడ కులమతాలకతీతంగా ప్రతి ఒక్కర్నీ సమానంగా చూడటం విశేషం. దీంతో వేలాదికి మందికి ఇక్కడ ఉచితంగా ఆహారం అందుతుంది. మీరెప్పుడైనా ఈ స్వర్ణ మందిరాన్ని నిశితంగా పరిశీలించారా? అలా గమనిస్తే ఈ ఆలయ నిర్మాణ శైలి మీకు అర్థమవుతుంది. ఈ ఆలయాన్ని హిందూ – మొఘల్ కలయిక శైలిలో అద్భుతంగా నిర్మించారు. గోపురం వెలుపలి భాగం నుండి కిటికీలు, గుమ్మాల వరకు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. దీంతో ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మాణ కూడా ఓ అద్భుతమనే చెప్పాలి. ఇతర మతపరమైన ప్రదేశాల మాదిరిగా కాకుండా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ఉండే మెట్ల మార్గం కిందకు ఉంటుంది. అంటే దీని అర్థం దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు తమకున్న అహంకారం, రాగద్వేషాలను వదులుకొని వినయ పూర్వకంగా మెలగాలని. ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరాడంబరమైన జీవనశైలిని కలిగి ఉంటే దేవుని ఆశిస్సులు ఉంటాయనేది దానివెనకున్న ఉద్దేశం. ఈ ఆలయం అన్ని మతాల వారికీ తెరిచి ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి నలుదిక్కులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అంటే ఇది అన్ని మతాల వారినీ ఆదరిస్తుందని అర్థం. మరోవైపు ఆలయ నిర్మాణ సమయంలోనూ గురు అర్జన్ దేవ్ సుఫీ సెయింట్ మియాన్ మీర్ను ఆలయ శంకుస్థాపనకు ఆహ్వానించారు. దాంతో అక్కడ కుల, మతాలతో సంబంధం లేకుండా ఆలయానికి ఎవరైనా వెళ్లొచ్చనే భావన కలిగించారు. అలాగే ఈ స్వర్ణ మందిరంలో ఎవరైనా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గోల్డెన్ టెంపుల్లో మీ సేవలు అందించవచ్చు. అక్కడ మీరు సేవ చేయడానికి కచ్చితంగా సిక్కులే అయి ఉండాల్సిన పనిలేదు. మీకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే హ్యాపీగా అక్కడ పాల్గొనవచ్చు.
శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం వైజాగ్ బలమైన చారిత్రక నేపథ్య ప్రాముఖ్యతతో సమరూపతతో నడిచే నిర్మాణాన్ని కలిగి ఉంది. హిందూ సమాజానికి అంకితం చేయబడిన మహాలక్ష్మి ఆలయం శ్రీ కనక మహాలక్ష్మి భక్తులకు విశ్రాంతి, దైవిక మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. మహాలక్ష్మి ఆలయ సమయాలు ఉదయం 05:00 నుండి రాత్రి 09:00 వరకు.ఇది నిస్సందేహంగా హిందూ సమాజానికి సందర్శించదగిన ప్రదేశం. మహాలక్ష్మి అవతారమైన ప్రతిష్ఠాపన విగ్రహం అప్పట్లో ఈ ప్రాంత నాయకుల వంశ దేవుడని, ఆమెను అమ్మవారిగా కీర్తించేవారు.
శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం చరిత్ర:
స్థానిక కథనం 1912 ప్రకారం, మునిసిపల్ అధికారులు బావి నుండి శ్రీ కనక మహా లక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని తొలగించారు. వారు రోడ్డు మధ్యలో, అంటే మున్సిపల్ లేన్ మధ్యలో ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణ కోసం మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని రోడ్డు మధ్యలో నుంచి వీధి మూలకు మార్చారు. ఈ కాలంలో అంటే 1917లో ‘ప్లేగు’ అనే ప్రమాదకరమైన అంటువ్యాధి పట్టణంలో వ్యాపించి, విశాఖపట్నం గ్రామంలో చాలా మరణాలు సంభవించాయి. ఈ ఘటనతో విశాఖ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శ్రీ కనక మహా లక్ష్మి దేవి విగ్రహాన్ని మార్చడం వల్లనే ఈ విధ్వంసం జరిగిందని వారు భావించి, అమ్మవారి విగ్రహాన్ని అసలు స్థలానికి, అంటే ప్రస్తుతం ఉన్న విధంగా రహదారి మధ్యలో తిరిగి ప్రతిష్టించారు. తిరిగి అంగస్తంభన కారణంగా మహా లక్ష్మి ‘ప్లేగు’ వ్యాధిని నయం చేసి సాధారణ స్థితిని కల్పించింది. దీంతో అదంతా అమ్మవారి అద్భుతమేనని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ విధంగా అప్పటి నుంచి గ్రామస్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించేవారు. ఇంకా, చుట్టుప్రక్కల ప్రజలు ‘శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారు’ ‘సత్యమాత’ అని మరియు వారి అవసరాలను తీర్చడం ద్వారా తన భక్తులను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతారు. దేవి “సుమంగళి”ని అనుగ్రహిస్తుందని మహిళా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అమ్మవారి భక్తులు తమ శిశువులను ఆలయానికి తీసుకువచ్చి, అమ్మవారి పాదాల వద్ద ఉంచి, ఆశీర్వాదం కోరుకుంటారు.
శ్రీ కనక మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం:
జీవితంలోని వివిధ కోణాల నుండి ప్రజలను ఆకర్షించడానికి ప్రధాన కారణం మార్గశిర మాస మహోత్సవం పండుగ యొక్క వార్షిక వేడుక, ఇది ప్రతి సంవత్సరం ఒక నెలపాటు ఆనందిస్తుంది. ఈ సమయంలో, వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం మరియు ఆమెకు ప్రార్థనలు చేస్తారు. గురువారాల్లో, భక్తులు వారంలోని అదనపు రోజుల కంటే మూడు రెట్లు లేదా రెట్టింపు సంఖ్యకు పెరుగుతారు. ఎందుకంటే ఇది శ్రీ మహాలక్ష్మికి అనుకూలమైన రోజుగా పరిగణించబడుతుంది.
వైజాగ్ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో జరుపుకునే ఉత్సవాలు:
మార్గశిర మాస సంబరాలు, దేవస్థానంలో వార్షిక పండుగ, మార్గశిరమాస మహోత్సవం, ఒక నెలవారీ వేడుక. మార్గశిర మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ కనక మహా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు. ఈ మాసంలో ఆమెను పూజించే భక్తుల సంఖ్య మిగిలిన పదకొండు నెలల్లో ఆమెను మించిపోయింది.
తిరుమల ఉత్తర వాకిలి దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బారులు తీరిన భక్తులు. రాత్రి 10 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అర్ధరాత్రి దాటిన తర్వాత టోకెన్లు జారీ చేసిన టిటిడి. పది రోజులపాటు ఉత్తర ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీ. టికెట్ కౌంటర్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు. తోపులాటలు తోక్కిసలాటలు జరగకుండా విజిలెన్స్, పోలీస్ అధికారుల సమన్వయంతో క్యూ లైన్ లో నికి భక్తులను అనుమతిస్తున్న అధికారులు.
గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్ తన కుటుంబ సభ్యులతో కలిసి చౌడేపల్లిలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు న్యాయమూర్తి కార్తీక్, ఆలయ మాజీ చైర్మన్లు కెవి రాజన్న, చెన్నరాజు శెట్టి పాల్గొన్నారు.
ఒకప్పుడు చౌడేపల్లి నివసిస్తులైన న్యాయమూర్తి గ్రామస్తులను సన్నిహితులను పేరుపేరునా పలకరించారు. ఉదయం చౌడేపల్లి చెడుగుట్లపల్లి రోడ్డు నందు తమ పూర్వీకులు ప్రతిష్టించిన నాగదేవతల ఆలయంలో అభిషేకాలు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
గురువారం సాయిబాబాకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజున సాయి దివ్య పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది.
పూజా విధానం
స్నానం చేసి, శుభ్రమైన దుస్తులను ధరించండి. సాయిబాబా చిత్రం లేదా విగ్రహాన్ని ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచండి. పూజా గదిని శుభ్రం చేసి, పూలు, అక్షతలు, కుంకుమ, అగరువత్తులు, దీపాలు, పండ్లతో అలంకరించండి. స్థానిక దేవుని పూజ చేసి, శుద్ధి చేసుకోండి. సాయిబాబా చిత్రం లేదా విగ్రహం ముందు నిలబడి, పాదపూజ చేయండి. “ఓం సాయియ్య నమః” అని 108 సార్లు జపించండి. సాయిబాబాకు పూలు, అక్షతలు, కుంకుమ, అగరువత్తులు, దీపాలు సమర్పించండి. పండ్లు, నైవేద్యం సమర్పించండి.