తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,049 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం3.97 కోట్లు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 26,748 మంది, శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి టీబీసీ ఏరియా వరకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
Devotional
తిరుమల శ్రీవారి దర్శనార్ధం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం లో గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి నడుచుకుంటూ దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు. నడక మార్గంలో వస్తున్న దీపికా పదుకుణేతో భక్తులు సెల్పీలు తీసుకున్నారు. అనంతరం తిరుమలలోని అతిధి గృహం చేరుకున్న దీపికా పదుకుణే, రాత్రి తిరుమలలో బస చేసి, శుక్రవారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో మరియు విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.
రాముల వారి కళ్యాణానికి సిద్ధమైన కోటి తలంబ్రాల పంట. ఏటా భద్రాద్రి రాముని కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల పంట కోత వినూత్నంగా సాగింది. వానరుల వేషధారణతో రైతులు తలంబ్రాల పంటను కోత కోశారు. తలంబ్రాలకు అవసరమైన పంటను వానర్లే స్వయంగా పండించుకుని కోతలు కోయడం చూపరులను ఆకట్టుకుంటుంది. గోటితో ఒలిచే కోటి తలంబ్రాల పంటకు పంచామృతాభిషేకం జరిగింది. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో శ్రీరామ భక్తులు వానర వేషధారణలతో రాముని పంట కోత కోశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణం అప్పారావు తన తల్లి పొలంలో 13 ఏళ్లుగా ఈ పంట పండిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తుల ఆలయంలో పూజించి తీసుకువచ్చిన ధాన్యాన్ని వరి నారువేసి, నాట్లు వేసి, పంట పండిస్తున్నారు. ఈ పంటపై వచ్చిన ధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో రామ భక్తులకు పంపించి గోటితో ఒలిచి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తారు. ఈ తలంబ్రాలను భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాలకు శ్రీరామనవమి పర్వదినం రోజున కోటి తలంబ్రాల కోసం పంపించడమే కాకుండా అయోధ్య రామునికి సైతం పంపించి అక్కడ కళ్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వానర వేషధారణలో పంట కోత కోయడం నిర్వహించారు. వరి కంకులకు పంచామృతాభిషేకం నిర్వహించి, పొలంలో ఉన్న రాముని ఆలయం వద్ద మహిళలతో శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్చాలీసా పారాయణ కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. వానర వేషధారణలతో ఉన్న రైతులు , కూలీలు రాముని పంట కోత కోశారు. ఆధ్యాత్మిక చింతనతో కొనసాగిన కోటి తలంబ్రాల పంట కోత అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ కోటి గోటి తలంబ్రాల కోసం పండించిన ఈ ధాన్యాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 800 కేజీల ధాన్యాన్ని రామభక్తులతో గోటితో ఒలిపించి కోటి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. భద్రాచలం ఒంటిమిట్ట రామాలయాలే కాకుండా అయోధ్య రామలయానికి లోక కళ్యాణం కోసం తీసుకువెళ్లి స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో మహిళలు, రైతులు పాల్గొన్నారు.
సరస్వతి దేవి పూజ వల్ల చదువులో రాణించాలనుకునే విద్యార్థులకు మంచి ఫలితాలు కలుగుతాయి.
సరస్వతి దేవిని పూజించే ముందు, శుభమైన సమయం, ముహూర్తం చూసుకోవాలి. పూజ కోసం తెల్లటి లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజ గదిని శుభ్రపరచి, సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. విగ్రహానికి పసుపు, తెల్ల రంగు పువ్వులు, బిల్వ పత్రాలు, అక్షరాలు, వీణ, పుస్తకాలు మొదలైనవి సమర్పించాలి.
సరస్వతి దేవిని పూజించేటప్పుడు, ఆమె స్తోత్రాలు, అష్టోత్తర శతకం మొదలైనవి పఠించాలి. పూజ ముగిసిన తర్వాత, దీపారాధన చేసి, నైవేద్యం సమర్పించాలి.
సరస్వతి దేవి పూజ వల్ల కలిగే ఫలితాలు:
- చదువులో మంచి ఫలితాలు
- జ్ఞానం, వివేకం పెరుగుట
- వాక్ శక్తి పెరుగుట
- సంగీతం, కళలకు ప్రావీణ్యం
- సృజనాత్మకత పెరుగుట
సరస్వతి దేవి పూజను నిష్ఠతో చేస్తే, చదువులో రాణించాలనుకునే విద్యార్థులకు కచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి.
అర్చకులు అజయ్ త్రిపాఠి మాట్లాడుతూ షిరిడి సాయిబాబా 1835 లో లోకంలోకి అడుగుపెట్టినట్లు చరిత్ర చెబుతుందన్నారు. బాబా తన 16 వేట మొదటిసారిగా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ కు వచ్చారని, వేప చెట్టు కింద ఆసనం వేసి లోతైన ధ్యానం లో మునిగిన బాబాను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారన్నారు. బాబా అనంతరం ఓ మసీదులో ఉంటూ పూజలు నిర్వహించేవారని , బాబా యొక్క మహిమ విభూది ద్వారా ప్రపంచానికి వ్యాపించిందన్నారు. నీటితో దీపాలను వెలిగించి బాబా తన మహిమను ప్రజలకు చూపించారని, ఎందరో రోగులకు వ్యాధి నయం చేసి, భక్తుల చేత ఆరాధింపబడ్డారన్నారు. శ్రీ షిరిడి సాయినాధునికి కులమతాలకు అతీతంగా నాడు భక్తులు విశ్వసించే వారని, నేట్కి బాబా భక్తులు సర్వమత సమ్మేళనం పాటిస్తున్నారన్నారు. బాబా ఏనాడు తాను భగవంతుడిని అంటూ ప్రకటించుకోలేదని, కేవలం గురువుగా గుర్తించబడెందుకు ప్రయత్నించే వారన్నారు. నిశ్చలమైన భక్తితో బాబాను పూజిస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయని, నేటికీ ఎందరో భక్తులు బాబాను విశ్వసిస్తూ బాబా విభూదిని స్వీకరిస్తున్నారన్నారు. ఒంగోలులోని లాయర్ పేటలో శ్రీ శిరిడి సాయినాధుని ఆలయంలో భక్తులు ప్రతిరోజు బాబాకు హారతులు ఇచ్చే సమయంలో అధిక సంఖ్యలో హాజరవుతారని, బాబాను ప్రతిరోజు ప్రత్యేక పూలతో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరిస్తారన్నారు. బాబా అనే నామం పలికినా చాలు చీకటి లోన సైతం బాబా దీపం వలే దారిని చూపుతారని, అంధకారమైన జీవితాలను బాబా తన వెలుగులతో అంధకారాన్ని తొలగిస్తారన్నారు.
Read Also..
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి గత సంవత్సరం కంటే కొద్దిగా ఆదాయం పెరిగింది. మొత్తం 6,14,22,180 రూపాయల నగదు రాబడిగా లభించగా ఈ ఆదాయాన్ని గత 28 రోజులలో కార్తీకమాసం సందర్భంగా శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటుగా ఈ హుండీ లెక్కింపులో 403 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 10 కేజీల 160 గ్రాముల వెండి లభించగా వీటితోపాటు పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు. అందులో 1118- యుఎస్ఏ డాలర్లు, 130 యూఏఈ దిర్హమ్స్, 100 యూకే ఫౌండ్స్, 40 – ఆస్ట్రేలియా డాలర్లు, 22 మలేషియా రింగిట్స్, 20- కెనడా డాలర్లు, 19 సింగపూర్ డాలర్లు, 10 – ఈరోస్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
ఆయ్యప్ప భక్తుల తాకిడితో శబరిమల గిరులు నిండిపోయాయి. 19గంటల పాటు మణికంఠుని దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
నవంబర్ 17నుండి అయ్యప్ప దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం అనుమతినివ్వటంతో భక్తుల సందడి ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అయ్యప్ప భక్తులు మణికంఠుని దర్శించుకునేందుకు దీక్షలు చేపట్టారు. శబరిమలలో యాత్రికుల రద్దీ అదుపు తప్పుతున్న నేపథ్యంలో హైకోర్టు కఠిన చర్యలు తీసుకుంది. బుకింగ్ లేకుండా శబరిమలలోకి ఎవరినీ అనుమతించరాదని హైకోర్టు ధర్మాసనం దేవస్థానంను ఆదేశించింది. వర్చువల్ బుకింగ్, స్పాట్ బుకింగ్ లేకుండా ఎవరూ ప్రయాణించకూడదని కోర్టు కోరింది. శబరిమల వద్ద భక్తులకు సహాయం చేసేందుకు సమీపంలోని కళాశాలల ఎన్ఎస్ఎస్, ఎన్సిసి క్యాడెట్ల సహాయాన్ని కోరాలని దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది. ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్లు, స్పాట్లో 30 వేల బుకింగ్స్ ఉంటున్నాయని అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో.. దర్శనాలను త్వరగా చూడాలన్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందన్నారు. అయ్యప్ప దర్శన సమయాలను ప్రతిరోజూ 19 గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని టీబీడీ పేర్కొంది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పొడిగించింది. ప్రస్తుతం రోజుల్లో రెండో భాగంలో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు.
పోలి స్వర్గస్నానం చేసేందుకు విజయవాడలో కృష్ణా నదికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి వద్దకు కుటుంబాల సమేతంగా తరలివచ్చారు. దుర్గా ఘాట్ భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పోలి స్నానం ఆచరించి కార్తీక దీపాలు వదిలారు.
Read Also..
Read Also..
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో మార్గశిర పాడ్యమి పోలిస్వర్గం పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో పట్టణంలోని వలందర్, అమరేశ్వర స్నానాల రేవులు భక్తులతో కిటకిటలాడాయి. స్నానమాచరించి గోదావరి గట్టుపై పూజలు చేసి అనంతరం పాడ్యమి దీపాలను నదిలో విడిచిపెట్టారు. పోలిస్వర్గoగా పిలుచుకునే పూజా కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసంలో పూజా కార్యక్రమాలు చేయలేని భక్తులు పాడ్యమి రోజున నదిలో పుణ్య స్నానం చేసి 30 దీపాలు విడిచి పెడితే కార్తీక మాసంలో నెల రోజుల పాటు చేసే పూజా కార్యక్రమాలకు వచ్చేంత పుణ్య ఫలం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం.
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం, మురమళ్ల కార్తీక మాసం అమావాస్య మహా పర్వదినం పురస్కరించుకుని మురమళ్లశ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వారి ఆలయంలో దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా మంగళవారం జరిగింది. భక్తులు వెలిగించిన దీపాళ కాంతులతో ఆలయం కళకళలాడింది. కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ కుమార్, ఆలయం కమిటీ చైర్మన్ వాసురాజు లతో పాటు పలువురు నాయకులు.ఆలయంలో ప్రత్యేక పూజలు… ఆకర్షనీయంగా నిలిచిన మంచుకొండల నడుమ శివలింగం సెంటింగ్. ముమ్మిడివరం శాసన సభ్యులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్.కుమార్, చైర్మన్ శ్రీ పెన్మత్స వాసురాజు దంపతులు, కార్యనిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. తొలుత పార్థీవ లింగానికి ఆలయ అర్చకులు , పురోహితులు ఆధ్వర్యంలో అభిషేకం ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఆవరణ చుట్టూ దేవతా మూర్తుల ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ వెలుపల, బయట దీపాలంకరణ తో ఆలయం కళకళలాడింది. మండల నలుమూలల నుండి భక్తులు దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం పచ్చి పూల అలంకరణ తో సర్వాంగసుందరంగా అలంకరించారు.సత్యసాయి సేవా ట్రస్ట్ సేవకులు, సమరసత సేవ ట్రస్ట్ నుండి విశేషసేవలందించారు. కార్యనిర్వాహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, సర్పంచ్ కాలే రాజబాబు, పెన్మత్స చిట్టిరాజు, మాజీ చైర్మన్ లు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.