Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh భక్తులతో కిటకిటలాడుతున్న వశిష్ట గోదావరి

భక్తులతో కిటకిటలాడుతున్న వశిష్ట గోదావరి

by Satya
Vasishta Godavari

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో మార్గశిర పాడ్యమి పోలిస్వర్గం పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో పట్టణంలోని వలందర్, అమరేశ్వర స్నానాల రేవులు భక్తులతో కిటకిటలాడాయి. స్నానమాచరించి గోదావరి గట్టుపై పూజలు చేసి అనంతరం పాడ్యమి దీపాలను నదిలో విడిచిపెట్టారు. పోలిస్వర్గoగా పిలుచుకునే పూజా కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసంలో పూజా కార్యక్రమాలు చేయలేని భక్తులు పాడ్యమి రోజున నదిలో పుణ్య స్నానం చేసి 30 దీపాలు విడిచి పెడితే కార్తీక మాసంలో నెల రోజుల పాటు చేసే పూజా కార్యక్రమాలకు వచ్చేంత పుణ్య ఫలం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం.

Advertisements

You may also like

Our Visitor

026069
Total views : 149844

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.