11
లెబనాన్పై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. దాడుల్లో కనీసం 16 మంది మృతి చెందినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఇరాన్-అమెరికా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.




Total views : 150595