తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లో నేడు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసారు. కాని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం నిత్యము జరిగే అభిషేక సేవలు, రాహు కేతు సర్ప దోష పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ కాలము నందు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకముగా గ్రహణ కాలాభిషేకం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో గ్రహణ కాలాభిషేకంలో పాల్గొనడానికి భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తారు.
Devotional
ఏపీలోని ప్రముఖ దేవాలయాలు మూతపడనున్నాయి. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులు మూసివేస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. నేడు సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం గుడి తలపులు మూయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నేడు మూతపడనుంది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు. 29 న ఉదయం 8 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఈ గ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. శనివారం రాత్రి ఆలయాలు తలుపులు మూయనున్నారు. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున తలుపులు తెరుచుకోనున్నాయని అధికారులు తెలిపారు.
దసరా శరన్నవరాత్రులు ముగిసిన సందర్భంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఘనంగా దుర్గాపూజ కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్కు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ దుర్గా పూజ కార్నివాల్ను వేల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నృత్య కళలు చూపరులను అలరించాయి. దుర్గాదేవికి సంబంధించిన ఓ భక్తి పాటకు పురుష, మహిళా కళాకారులు కర్రలపై నిలబడి చేసిన నృత్యం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్నివాల్లో ప్రదర్శించిన వివిధ కళలను మమతాబెనర్జీ ఆసక్తిగా తిలకించారు. పాటకు అనుగుణంగా తన ముందున్న టేబుల్పై రెండు చేతులతో లయబద్ధంగా కొడుతూ ఆమె ఎంజాయ్ చేశారు.
రాహుకేతువుల రాశి మార్పు వల్ల అనేకమంది వ్యక్తుల జీవితాల్లో తీవ్రమైన మార్పులు జరుగవచ్చు. గోచారం ప్రకారం ఈనెల 30వ తేదీన జరగనున్న రాహుకేతువుల రాశి మార్పుతో ప్రధానంగా మూడు రాశులు అత్యంత శుభాలను పొందబోతున్నాయి. గోచారం ప్రకారం రాహువు మేష రాశి నుంచి మీన రాశిలోకి, కేతువు తులా రాశి నుంచి కన్యా రాశిలో ప్రవేశిస్తారు. ఇది కొన్ని రాశులవారి అంతులేని లాభాలను కురిపించనుంది. ముఖ్యంగా మూడు రాశులవారు చేపట్టే ప్రతి పని సక్సెస్ అవుతుందనటంలో సందేహం లేదు. దాదాపు 18 నెలలు ఈ రాశులవారు రాజభోగాలను అనుభవిస్తారు. ఇప్పుడు ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశివారు కెరీర్ పరంగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తద్వారా ఆర్థికసమస్యలు తొలగి.జీవితం సుఖమయం అవుతుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు, వ్యాపార వృద్ధి , మరిన్ని ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణం లాభసాటిగా మారుతుంది. జీవిత భాగస్వామితో చక్కటి అనుబంధంఏర్పడుతుంది.
కర్కాటక రాశి వారు అభివృద్ధి చెందడానికి, అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ధనలాభంతో ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. అదృష్టం తోడుగా ఉండటంవల్ల చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగనున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన ధనం చేతికందుతుంది. వివాహ యోగ్యత వుంది, ప్రేమలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాదుల్లో మంచి అభివృద్ది సాద్యమవుతుంది. మీరనుకున్న కార్యక్రమాలు ఫలిస్తాయి. మేష రాశి వారి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వెతుకుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు. కొత్త వెంచర్లకు అనుకూలం, నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రతీ అవకాశాన్ని నూరు శాతం అందిపుచ్చుకుంటారు. ఇది దేవుడు మీకు ఇచ్చిన బంగారు అవకాశం. ఇక మిగిలిన రాసులుకొన్నింటికి చిన్న పరిహారాలతో అత్యంత మేలు కలుగుతుంది. వాటిలో ధనసు, సింహం, వృశ్చికం, మకరం రాశులకు కలసి వస్తుంది. మిగిలిన రాశులుతగిన పరిహారాలు తప్పక
చేయించుకోవాలి.
దేవుని ముందు పెట్టిన ప్రసాదాన్ని దేవుడు తింటే అది చూసి పులకించని భక్తులు ఉండరు.కానీ అల ఎక్కడైనా జరుగుతుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానము మంగళగిరి శ్రీ పానకాల నరసింహ స్వామి. ఈ విషయాన్ని వివరంగ తెలుసుకునే ముందు ఇక్కడి స్థల పురాణాన్ని కాస్త తెలుసుకుందాము. ఈ క్షేత్రం విజయవాడ మరియు గుంటూరు కు అతి చేరువలో ఉంది.విజయవాడ నుంచి ప్రతి 10 నిమిషాలకు గుంటూరు కు బస్సు సౌకర్యం కలదు. ఆ మార్గ మధ్య లోనే ఈ ఆలయం కలదు. మన రాష్ట్రము లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు లేదా రైల్ ప్రయాణం ద్వారా ఈ ఆలయాన్నిసులభంగా చేరుకోవచ్చు. మీకు ఈ ఆలయ సందర్శనార్ధం ఎలాంటి సమాచారాన్నైనా అందిచటానికి మా బ్లాగ్ సిద్ధంగా ఉంది. స్థల పురాణం ఇక్కడ రెండు రకాలైన కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో మొదటిది పూర్వం ఈ ప్రాంతాన్ని పారియాత్ర అను రాజు పాలించేవాడు.అతనికి సంతానము లేకపోవుటచే, సంతానం కొరకు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగగా అతనికి ఒక శిశువు జన్మించాడు.అతనికి హస్తసృంగి అని పేరు పెట్టాడు. కానీ దురదృష్టవసాత్తు అ పిల్లవాడు అంగవికలాంగుడిగా జన్మించాడు. ఆ రాజు తన పుత్రుని చూసి చాల విచారపడ్డాడు. తండ్రి బాధ చూసి హస్తసృంగి బాధాతప్త హృదయంతో అడవులకు వెళ్లి భగవంతుని సాక్షాత్కారం కోసం ఘోరమైన తపస్సు చేసాడు. అంతట శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగా హస్తసృంగి తనకు తన జీవితాంతం భగవంతుని పాదాల చెంత ఉండాలని ఉండాలని చెప్పగా, శ్రీమహావిష్ణువు హస్తసృంగిని ఒక కొండగా మార్చివేసి దానిపై శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం లో కొలువయ్యాడు. అదియే ఇప్పటి పానకాల నరసింహస్వామి ఆలయం. మరియొక కథ కూడా ఈ ఆలయం గూర్చి ప్రచారం లో ఉంది. మహిషాసుర వధ జరిగిన తరువాత దుర్గమ్మ ఆగ్రహాగ్నితో రగిలిపోయింది. అప్పుడు ఆమె అగ్ని తన రెండవ కంటి ద్వార ఒక కొండపైకి వదిలి ఆ కొండను పెళ్ళగించి గాలిలోకి విసిరివేసింది. అదియె ఇప్పటి నరసింహ స్వామి కొలువైన కొండ.కాని దుర్గమ్మ నుంచి వెలువడిన ఆ అగ్నిజ్వాలలు మాత్రం ఆ కొండ నుండి అలాగే వెలువడుతున్నాయి. తరువాతి కాలంలో నరసింహ స్వామి హిరణ్యకసిపున్ని చంపిన తరువాత అలాంటి అగ్నిజ్వాలల తోనే రగిలిపోయాడు.అప్పుడు ప్రహ్లాదుడు ఆయనను స్తుతించగా ప్రసన్నుడై తన నుంచి వెలువడుతున్న అగ్నిజ్వలను తను అదుపుచేసుకోదలచి అనువైన ప్రాంతాన్ని వెతకుచున్న సమయంలో అప్పటికే అగ్నితో రగులుతున్న ఈ కొండ కనిపించి అక్కడే తనకు అనువైన ప్రాంతం అని తలచి నరసింహ స్వామి ఇక్కడే కొలువైయ్యాడు. కాని అగ్ని జ్వాలలు మాత్రం చల్లారలేదు. బ్రహ్మదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామిని పానకంతో అభిషేకించగా అగ్నిజ్వాలలు పూర్తిగా ఆరిపోయాయి. అప్పటినుంచి ఇక్కడ పానకంతో అభిషేకించడం ఆనవాయితీగా మారింది. ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం ఏమిటంటే స్వామి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి నోటిలో పోస్తే నరసింహుడు ఆ పానకాన్ని గుటకలు వేస్తూ సంతోషంగా స్వీకరిస్తాడు.గుటకలు వేసిన శబ్దం కూడా స్ఫష్టంగా వినిపిస్తుంది.స్వామికి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి కి అందివ్వగా స్వామి దానిని త్రాగి మరల కొంత పానకాన్ని బయటకు వదులుతాడు.దానినే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.మరియొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నిరంతరం పానకం నైవేద్యం వల్ల అక్కడ పానకం నేలపై పడినా అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు మరియు ఒక ఈగ కూడా వాలదు. భగవంతుడుకి ఇచ్చిన ప్రసాదాన్ని భగవంతుడే తింటే వచ్చే అలౌకిక ఆనందాన్ని భక్తులు సొంతం చేసుకుంటారు. ఇది ప్రతి తెలుగువాడు ఖచ్చితంగా చూడదగ్గ ప్రాంతం.
Read Also..
Read Also..
స + అష్ట + అంగ = సాష్టాంగ. అనగా 8 అంగములతో నమస్కారం చేయడం. అలా నమస్కారం చేసే సమయంలో ఈ శ్లోకం చదవాలి.
శ్లో !! ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే !!
అష్టాంగాలు : ఉరసు అంటే తొడలు, శిరసు అంటే తల, దృష్టి అనగా కళ్ళు, మనసు అనగా హృదయం, వచసు అనగా నోరు, పద్భ్యాం – పాదములు, కరాభ్యాం – చేతులు, కర్నాభ్యాం – చెవులు. బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు.
కడప టౌన్ నుంచి ఒంటిమిట్ట 25km ఉంటుంది . శ్రీ కోదండరామ స్వామి ఆలయం ప్రసిద్ధిచెందాడు. ఈ ఆలయం ఒక రాయతో తాయారు చేయబడ్డాయి. రామ్, సీతా లక్ష్మణులు, విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉండదు. ఎందుకు అంటే.. గుడి కట్టినపుడు రాముడు ఆంజనేయ స్వామి ని కలవ లేదు. అందుకు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు. శ్రీ కోదండరామ స్వామి ఆలయం రామతీర్థం మరియులక్ష్మనతిర్థం వంటి ఇద్దరి నిత్యం కొలనులు ఉన్నాయి. పురాణ నుండి కొన్ని సంఘటనలకు రామాయణం మరియు మహాభారతం ఈ ఆలయం లోపల కళారూపంలో శృంగారమైన చేశారు. జానపద నమ్మకం ప్రకారం, గ్రామం రెండు వ్యక్తులు, కంపన రాజు సహాయం చేసిన వొంతోడు మరియు మిత్తోడు, నుండి దాని పేరు పొందింది. బదులుగా, రాజు వాటిని తర్వాత గ్రామం పేరు. సమయం కాలంలో, గ్రామం ఒంటిమిట్ట అనేవారు.
దేహాభిమానాన్ని వదిలితేనే జీవుడు… దేవుడు చిన్నికృష్ణుడు గోకులంలోని ఇండ్లలో కుండలను పగలగొట్టి వెన్నను దొంగలించినప్పుడు “కృష్ణా మా ఉపాధులనే కుండలను పగులగొట్టి హృదయమనే వెన్నను దొంగాలించావా.. ఎంత దొంగవయ్యా నీవు”.. అని… అంటుంటారు గోకులంలోని యాదవులు, భగవంతుడు మనకు మనోబుద్ధులను ప్రసాదించింది మనం మోక్షాన్ని పొందటానికే. కాలం వృధా చేసుకోకుండా ఆద్యాత్మిక చింతనతో సాధన చేసి మోక్షాన్ని పొందాలి. భగవంతుడిచ్చిన వాటిని తిరిగి ఆయనకే సమర్పించాలి. లేకపోతే దర్మం తప్పినవారవుతారు. మనసు నిజంగా లౌకికానందాల గని… అది తనకు నచ్చిన పనులు చేస్తుందే గాని బుద్ది చెప్పిన పనులు చేయదు. తల దువ్వుకోటానికో నగలు అలంకరించుకోటానికో; బూటు పాలిష్ చేసుకోవటానికో; కాలరు టై బిగించుకోటానికో; సౌందర్య లేపనాలను రాసుకోవటానికో గంటలు గంటలు ఖర్చు పెడుతుంది గాని, జపం చెయ్యటానికో, ధ్యానం చెయ్యటానికో పట్టుమని పది నిమిషాలు కేటాయించదు. భగవంతుడిని ధ్యానం చెయ్యమంటే మాత్రం అమ్మో కష్టం నావల్లకాదు బాబు అంటుంది మనసు. జపం చెయ్యటం లేదేం, ఎవరైనా గురువులు మనల్ని ధ్యానం చెయ్యండి, జపం చేయండి, దీక్షలు తీసుకొండి అంటే చాలు.. ఏదండీ గురువుగారు అసలు తీరుబాటు కావటం లేదంటారు. “మీలాగా మేం ఆస్రమాల్లో లేము గదా”.. అని పైకి అనకపోయినా లోన అనుకొంటారు. ఇల్లూ, వాకిలి, పెళ్ళాం, బిడ్డలు, ఉద్యోగం, వ్యాపారం బోలెడు జంజాటకం. ఇవన్నీ కదల నివ్వటం లేదు అంటారు. నిజంగా అవి మనను పట్టుకున్నాయా.. మానవులు వాటిని పట్టుకొని విడిచిపెట్టలేక పోతున్నారా.. మామిడి తోటల్లో రైతులు కోతుల బెడద విలించుకోటానికి కడవను తీసుకెళతారు. దాని మూతి చిన్నది, పొట్ట పెద్దది. దానిని భూమిలో గుంట తీసి పూడ్చి మూతి మాత్రం భూమిపై కనిపించేట్లు ఉంచుతారు. దానిలో వేరుశెనగ పప్పులు వేస్తారు. వాళ్ళు చెట్టు చాటున నక్కి ఉంటారు. కోతి వచ్చి కుండలో చేయి పెట్టి వేరుశెనగ పప్పులను గుప్పిటి నిండా గట్టిగా పట్టుకుంటుంది. చెయ్యి బయటకు తీయబోతే రాదు. ఎందుకంటే లోపల పెట్టేటప్పుడు ఒట్టి చెయ్యి మాత్రమే, కానీ.. బయటకు తీసేటప్పుడు పప్పులతో ఉన్న గుప్పెట. చెయ్యి బయటకు రాకపోయే సరికి అసలే చపలచిత్తం గదా.. లోపల ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నారను కుంటుంది. తాను పట్టుకున్న గుప్పెట వదిలేస్తే తంటా తీరిపోతుంది. కాని అది గుప్పెట మాత్రం వదలదు. అలా చేతిని బయటకు లాగిలాగి పడిపోతుంది. దానితో కోతులను పట్టుకునే వ్యక్తి వచ్చి వాటిని పట్టుకుంటాడు. మానవుడు కూడా అంతే కదా … ఇక్కడి విషయవాసనలను పట్టుకొని వదలడు. అవే మనను పట్టుకున్నాయని వాదిస్తాడు. పోరాడి పోరాడి చివరకు శరీరాన్ని వదిలేస్తారు గాని పట్టు మాత్రం వదలరు.. పట్టువదలరు.. దానితో యమధర్మరాజు వచ్చి పట్టుకుపోతాడు. కనుక మనస్సు విషయవస్తువుల వ్యామోహం నుండి విడివడాలి. వాటిని విడిచి మనస్సును ఈశ్వరుని పై నిలపాలి. అలా ఎవరైతే మనోబుద్ధులను ఈశ్వరుని పై నిలుపుతారో వారు ఈశ్వరుని లోనే నిలుస్తారు, నివశిస్తారు. అంటే మనోబుద్ధుల అడ్డం తొలిగితే జీవుడు దేవుడే. ‘ఇందులో ఎటువంటి సంశయం అవసరం లేదు’. మనోబుద్ధులు రెండూ మన వ్యక్తిత్వమే. ఆ రెండూ భగవంతునిలో చేరితే మన వ్యక్తిత్వం నశించి ఆయనలో ఐక్యమైపోవటం జరుగుతుంది. ఉప్పుబొమ్మ సముద్రపు లోతులను కొలుస్తున్నట్లే మనస్సు ఆత్మసాగారాన్ని మధించాలి. చివరకు ఉప్పుబొమ్మ కరిగిపోయి సముద్రాకారంగా మారిపోయినట్లు మనస్సు కరిగి ఆత్మాకారంగా మారిపోవాలి. మన దివ్యత్మాన్ని మరచి నేను సామాన్యుణ్ణి అనుకొనే మానవుడు ఈ విషయాన్ని నమ్మలేక పోతున్నాడు. ఇందులో సందేహించవలసిందేమీ లేదు. ఈశ్వరుని యందు మనోబుద్ధులు రెండింటినీ పూర్తిగా నిలపటం తీవ్ర వైరాగ్య మూర్తులకే గాని సామాన్యులకు సాధ్యం కాదు..కానీ సాధనచేస్తే సాధ్యంకానిది వుందా ఈ జగత్తులో.. మీరే ఆలోచించండి.
గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం ఒకటి గుడిలో దాగి వుంది.గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. కషాయాలు, చూర్ణాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట. కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు ‘కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు. ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.వూళ్ళల్లో వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో మించింది ఏముంటుంది.పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన భోజనం ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరు. పైగా మేము ప్రసాదం తినము అని అదేదో గొప్ప పని చేసినట్టుగా గొంతు పెట్టి చెప్తారు. అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది. మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ఈ ప్రసాద వితరణ లో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది. ఒక ఊరి లో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. అదే దేముడికి ప్రసాదం చేయించండి, మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు. అలా చేయించిన పౌష్టికాహారాన్ని దేముడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం. మనం తీసుకునే పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, సెనగలు, కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతువు (ఐరన్), కార్బో హైడ్రేట్లు, కాల్షియం, పీచు పదార్థాలు, సోడియం, పొటాసియం, ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరి లోని జనాలందరినీ బలంగా, ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్ద వాళ్ళ ఉద్దేశ్యం.
విశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. సింహగిరి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండడం గమనార్హం.
స్థల పురాణం
అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నహసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించాడన్న పురాణ కథ అందరికీ తెలిసిందే.ఇలా తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది. దాంతో ఆరాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు. అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 12 రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది.
క్షేత్ర విశేషాలు
సింహాచలంలో ఉండే స్వామివారి గాలిగోపురంకు ఓ ప్రత్యేకత ఉంది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా సింహాచలంలోని గాలిగోపురం పడమర ముఖంగా ఉంటుంది. అలాగే ఇక్కడ గర్భగుడికి ఎదురుగా ఉండే ద్వజస్థంభాన్ని కప్ప స్థంభం అని వ్యవహరిస్తారు. గతంలో ఇక్కడే కప్పం అనబడే పన్నులు చెల్లించేవారని అందుకే కాలగమనంలో ఈ స్థంభానికి కప్ప స్థంభం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.సింహాచలం కొండపై అక్కడక్కడా జలధారలు ప్రవహిస్తుంటాయి. భక్తులు వీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తారు. వీటిలో గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనేవి ముఖ్యమైనవి.






Total views : 91152