Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home Telangana మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

by Rama
మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొనడం సరికాదని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. చెక్కులు నిలిపివేయడంతో లబ్ధిదారులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారన్నారు. కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు పలుసార్లు ఫోన్ చేస్తే మంత్రి చేతుల మీదుగానే పంపిణీ చేస్తామంటున్నారని అన్నారు. తన చేతుల మీదుగా పంపిణీ చేయడం ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయాలని సూచించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారుల చెక్కులను నిలిపివేశారన్నారు. వెంటనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయకపోతే మంగళవారం ఉదయం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కృష్ణారావు హెచ్చరించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.