బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(Kuna Srisailam Goud) కాంగ్రెస్ పార్టీ(Congress party)ల చేరారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ రాష్ట్ర వ్యవరహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కూన పార్టీలో చేరారు. కూన శ్రీశైలం గౌడ్ కు దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.