Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Latest News ప్రజా సమస్యలకై కృషి చేస్తున్న అనిరుద్ రెడ్డి..

ప్రజా సమస్యలకై కృషి చేస్తున్న అనిరుద్ రెడ్డి..

by Rama
anirudh reddy

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేటి నుండి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమకున్న సమస్యలను లిఖితపూర్వకంగా ఇస్తూ ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ప్రజా సమస్యలను ఎంతో ఓర్పుగా వింటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం మొదలైన రోజే ప్రజలనుంచి భారీ స్పందన లభించిందని మొదటి రోజే దాదాపుగా 50 కి పైగా వినతులు వచ్చాయని వీటిలో అధికంగా భూముల కబ్జా, భూముల డబల్ రిజిస్ట్రేషన్, ప్లాట్ల కబ్జాలకు సంబంధించి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి వాటి నిర్మాణం మరియు పెన్షన్లకు సంబంధించిన వినతి పత్రాలు అధికంగా ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన ప్రజల పక్షాన హామీ ఇచ్చారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: