Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh సొంత ఇంటి కల నెరవేర్చామన్న మహేష్ రెడ్డి..

సొంత ఇంటి కల నెరవేర్చామన్న మహేష్ రెడ్డి..

by Rama
kasu mahesh reddy

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక ఆర్ అండ్ బీ బంగ్లాలో గురజాల శాసనసభ్యులు కాసు.మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చామని, అందులో భాగంగానే దాచేపల్లి పట్టణంలో కూడా సుమారు రెండువేల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, వాటితో పాటు డిసెంబర్ 10వ తేదీన దాచేపల్లి పట్టణంలో మరో పదహారు వందల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని వారు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి కులాయివేసి త్రాగునీరు అందిస్తున్నామని, ఇప్పటికే హెల్త్ సెంటర్లు నిర్మించామని వారు తెలిపారు. వీటితోపాటు కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇవన్నీ పూర్తి చేసి దాచేపల్లిని ఒక ఉన్నత పట్టణంగా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

013825
Total views : 78143

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.