Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh భారీగా కర్ణాటక మద్యం పట్టివేత…

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత…

by Prakash
karnataka alcohol

ఈరోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్ గుంతకల్ పరిధిలో ఎస్పీ అనంతపూర్ వారి ఆదేశాల మేరకు మరియు ASP SEB అనంతపూర్ వారి సూచనలతో కర్ణాటక అక్రమ మద్యం రవాణాపై దాడులు నిర్వహించడమైనది. ఈ దాడులలో ధోనిముక్కల ఏరియాకు చెందిన బోయ భాస్కర్ అతని తండ్రి బోయ ఓబులేషు మరియు బోయ నాగరాజు అనే ముగ్గురు వ్యక్తులను హంద్రీనీవా కాలువ కసాపురం వద్ద అదుపులోకి తీసుకుని వారి నుంచి మొత్తం 30 బాక్సుల కర్ణాటక మద్యం మరియు ఆ మద్యం బాక్సులను రవాణా చేయ డానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకొనడం అయినది. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేయడమైనది. ముద్దాయిలు కర్ణాటక మద్యం ను రాయచూరు జిల్లా గిలక సుగుర్ మద్యం షాప్ ల నుండి కొని వాటిని ఓపెన్ wagan గూడ్స్ రైలు లో మంత్రాలయం రోడ్ స్టేషన్ వద్ద లోడ్ చేసుకొని గూడ్స్ కు వాక్యూమ్ తిసియేయడం ద్వారా గూడ్స్ ను ఆపి నంచర్ల స్టేషన్ వద్ద మద్యం బాక్సులు దింపుకొని ఆటో లో గుంతకల్ కు తీస్తుండగా పట్టుకొనడం జరిగింది. మొత్తం 2880 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొనడం అయినది. దాడులలో ఎస్సై చంద్రశేఖర్ మరియు సిబ్బంది రంగనాయకులు, సురేష్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: