గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డు లో ఉన్న వాసవి ఎలక్ట్రికల్ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు.. లక్షన్నర విలువచేసే ఆటో ఎలక్ట్రికల్ షెటర్ ను ధ్వంసం చేసి షాపులోకి వెళ్లి సీసీ కెమెరా వైర్లను ధ్వంసం చేసి క్యాష్ బాక్స్ లో ఉన్న 10 వేల రూపాయల నగదు తో ఎలక్ట్రిక్ వస్తువులను దోచుకెళ్లారు. మెయిన్ రోడ్ పక్కనే ఉన్న షాప్ లో ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడంతో అటుగా వెళుతున్న స్థానికులు షట్టర్ ద్వంశమై ఉండడాన్ని గమనించి యజమాని వెంకటరమణకు తెలిపారు. దీంతో యజమాని షాప్ దగ్గరకు చేరుకుని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీఐ వెంకట్రామిరెడ్డి తన సిబ్బందితో ఘటన తీరును పరిశించారు.అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగల బీభత్సం…అనంతరం క్లూస్ టీం తో పూర్తి ఆధారాలు సేకరిస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న షాపు అందునా 24 గంటలు ప్రజలు తిరిగే ప్రదేశం ఉన్నచోటే ఇంత పెద్ద ఎత్తున భారీ చోరీ ప్రయత్నం జరిగితే ఇంక ప్రజలకు రక్షణ ఎలా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. షాపులో ఇంకా ఎంత సరుకు దొంగతనం జరిగి ఉంటుంది అనేది తెలియాల్సి ఉందని షాప్ యజమాని వెంకటరమణ తెలిపారు…
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 78685