Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగల బీభత్సం…

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగల బీభత్సం…

by Rama
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగల బీభత్సం…

గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డు లో ఉన్న వాసవి ఎలక్ట్రికల్ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు.. లక్షన్నర విలువచేసే ఆటో ఎలక్ట్రికల్ షెటర్ ను ధ్వంసం చేసి షాపులోకి వెళ్లి సీసీ కెమెరా వైర్లను ధ్వంసం చేసి క్యాష్ బాక్స్ లో ఉన్న 10 వేల రూపాయల నగదు తో ఎలక్ట్రిక్ వస్తువులను దోచుకెళ్లారు. మెయిన్ రోడ్ పక్కనే ఉన్న షాప్ లో ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడంతో అటుగా వెళుతున్న స్థానికులు షట్టర్ ద్వంశమై ఉండడాన్ని గమనించి యజమాని వెంకటరమణకు తెలిపారు. దీంతో యజమాని షాప్ దగ్గరకు చేరుకుని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీఐ వెంకట్రామిరెడ్డి తన సిబ్బందితో ఘటన తీరును పరిశించారు.అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగల బీభత్సం…అనంతరం క్లూస్ టీం తో పూర్తి ఆధారాలు సేకరిస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న షాపు అందునా 24 గంటలు ప్రజలు తిరిగే ప్రదేశం ఉన్నచోటే ఇంత పెద్ద ఎత్తున భారీ చోరీ ప్రయత్నం జరిగితే ఇంక ప్రజలకు రక్షణ ఎలా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. షాపులో ఇంకా ఎంత సరుకు దొంగతనం జరిగి ఉంటుంది అనేది తెలియాల్సి ఉందని షాప్ యజమాని వెంకటరమణ తెలిపారు…

FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
    మధ్యప్రదేశ్‍లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…
  • మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..
    మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ. భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. చట్టప్రకారం ఆవులు, దూడలను వధించడం పూర్తిగా…
  • నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..
    నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం పాటిస్తున్నాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మోదీ, చంద్రబాబు పిలుపునిచ్చిన పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు సందేశాలను ఆచరణలో చూపిస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే… ఖర్చు…
  • యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..
    తెలంగాణవ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో…
  • పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..
    పంజాబ్ కింగ్స్ పూర్తిగా నిరుత్సాహంగా కనిపిస్తోంది. వరుసగా ఐదో ఓటమిని చవిచూసిన వారు చాలా కాలంగా 13 పాయింట్లకే పరిమితమై ఉన్నారు. ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసులో సీఎస్‌కే మరియు ఆర్‌ఆర్ కూడా వారికి దగ్గరగా వచ్చేశాయి. మరోసారి బౌలర్లే జట్టును నిరాశపరిచారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

013826
Total views : 78144

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.