తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కొరకు నాపై నిందలు వేస్తున్నాడని తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జాన్సన్ అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సివిల్ సప్లై స్టాక్ పాయింట్లో నేను అక్రమాలకు పాల్పడుతున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటన్నారు. అవినీతి, అక్రమాలకు ఎవరు పాల్పడుతున్నారో తాడిపత్రి ప్రజలందరికీ తెలుసన్నారు. ఎవరు నిజాయితీపరులో నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
ananthapur district news
ఈరోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్ గుంతకల్ పరిధిలో ఎస్పీ అనంతపూర్ వారి ఆదేశాల మేరకు మరియు ASP SEB అనంతపూర్ వారి సూచనలతో కర్ణాటక అక్రమ మద్యం రవాణాపై దాడులు నిర్వహించడమైనది. ఈ దాడులలో ధోనిముక్కల ఏరియాకు చెందిన బోయ భాస్కర్ అతని తండ్రి బోయ ఓబులేషు మరియు బోయ నాగరాజు అనే ముగ్గురు వ్యక్తులను హంద్రీనీవా కాలువ కసాపురం వద్ద అదుపులోకి తీసుకుని వారి నుంచి మొత్తం 30 బాక్సుల కర్ణాటక మద్యం మరియు ఆ మద్యం బాక్సులను రవాణా చేయ డానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకొనడం అయినది. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేయడమైనది. ముద్దాయిలు కర్ణాటక మద్యం ను రాయచూరు జిల్లా గిలక సుగుర్ మద్యం షాప్ ల నుండి కొని వాటిని ఓపెన్ wagan గూడ్స్ రైలు లో మంత్రాలయం రోడ్ స్టేషన్ వద్ద లోడ్ చేసుకొని గూడ్స్ కు వాక్యూమ్ తిసియేయడం ద్వారా గూడ్స్ ను ఆపి నంచర్ల స్టేషన్ వద్ద మద్యం బాక్సులు దింపుకొని ఆటో లో గుంతకల్ కు తీస్తుండగా పట్టుకొనడం జరిగింది. మొత్తం 2880 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొనడం అయినది. దాడులలో ఎస్సై చంద్రశేఖర్ మరియు సిబ్బంది రంగనాయకులు, సురేష్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






Total views : 78145