నంద్యాల జిల్లా(Nandyala) డోన్ పట్టణంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపారు. మొక్కులు చెల్లించుకున్నారు.
డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ లో జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహాత్మాగాంధీ ఆశయ సాధనకు అంతా పునరంకితం కావాలని బుగ్గన పిలుపునిచ్చారు.